సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడ వద్ద సోమవారం రాత్రి హనుమకొండ నుంచి వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గమనించిన డ్రైవర్, కండక్టర్లు వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను మరో బస్సులో సూర్యాపేటకు సురక్షితంగా తరలించారు.
WNP: కొత్త ఉగాది నామ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో ప్రజల జీవితాలలో సుఖసంతోషాలు తీసుకురావాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలో సాహితి కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో సాహితి కళావేదిక అధ్యక్షులు శంకర్ గౌడ్, నారాయణ రెడ్డి, వీరయ్య, కాజానో దిన్, సాహితీవేత్తలు పాల్గొన్నారు.
NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రెండు రోజా పాటు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని సోమవారం రాత్రి తెలిపింది. గంటకు 8 మ్తెళ్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున, రైతులు తమ పంట ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ADB: గంజాయి రహిత జిల్లా ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బోథ్ CI గురుస్వామి పిలుపునిచ్చారు. జొన్న పంటలో అంతర పంటగా గంజాయి మొక్కలను పెంచుతున్న చింతల్ బోరి, ధర్మపురి గ్రామానికి చెందిన ముకుందరావు, మారుతి అనే నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వ్యసనాల బారిన పడకుండా ఉండాలని CI తెలిపారు.
BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామం నుంచి నేరుగా ధర్మోజిగూడెం హైవే వరకు ఉన్న లింక్ రోడ్డును బైపాస్ రోడ్డుగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికు 5వ వార్డు కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ గౌడ్ వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చౌటుప్పల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ADB: జిల్లాలో ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా రోడ్ల పక్కన, పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించడం (ఓపెన్ డ్రింకింగ్)పై కఠిన చర్యలు తీసుకుంటామని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
JGL: ధర్మపురి మండలం రాయపట్నంలో గంజాయి కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయపట్నానికి చెందిన విష్ణు అనే వ్యక్తి గంజాయి కొనుగోలు కోసం లక్షెట్టిపేటకు చెందిన ప్రదీప్ను సంప్రదించాడు. ఎస్సై మహేశ్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. నిందితుల నుంచి 100 గ్రాముల గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
PDPL: రంజాన్ పర్వదినం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి పట్టణంలోని పలు మసీదులను సోమవారం రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ముస్లిం సోదరులను కలిసి మాట్లాడారు. జగ్నేకీ రాత్ సందర్భంగా ముస్లిం సోదరులు నమాజ్ నిర్వహించుకునే విధంగా ప్రత్యేక భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. మసీదు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలన్నారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో ఈనెల 19వ తేదీ గురువారం ఉగాది పర్వదిన వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. 27వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ శివార్చన వేదికపై స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు.
ADB: కులమతాలకు అతీతంగా ప్రతి పండుగలను సోదర భావంతో జరుపుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో నిర్వహించిన ‘దావత్-ఏ-ఇఫ్తార్’ విందు కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఖురాన్ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడం ఒక మంచి పరిణామమని పేర్కొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని జిల్లా ఎస్పీ నితికా పంత్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. వినియోగదారులకు సిలిండర్లు సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా అక్రమంగా సిలిండర్లను నిల్వ చేసినా లేదా అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
PDPL: నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. 2025–26 వార్షిక ప్రణాళిక కింద ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రీ వీలర్లు, సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ సెట్లు జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకాల కోసం ఈ నెల 24లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
JGL: తెలంగాణలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రవికుమార్ తెలిపారు. జగిత్యాలలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో ఈ నెల 31న ఉదయం 9 గంటలకు పోటీలు జరుగుతాయి. రాష్ట్రస్థాయి ఫైనల్ ఎంపికలు ఏప్రిల్ 28న హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహిస్తారు.
SRCL: ఎస్సీ యాక్షన్ ప్లాన్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. రవాణా రంగంలో 2 వీలర్, బీవీ 3 వీలర్, వ్యవసాయ రంగంలో సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 17 నుంచి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసి రాయితీ పొందాలని సూచించారు.
కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏవోగా రాజగోపాల్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. పదోన్నతిపై ఇక్కడికి వచ్చిన ఆయనకు డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణతో పాటు కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా, విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.