PDPL: రంజాన్ పర్వదినం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి పట్టణంలోని పలు మసీదులను సోమవారం రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ముస్లిం సోదరులను కలిసి మాట్లాడారు. జగ్నేకీ రాత్ సందర్భంగా ముస్లిం సోదరులు నమాజ్ నిర్వహించుకునే విధంగా ప్రత్యేక భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. మసీదు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలన్నారు.