VSP: అచ్చియమ్మపేట మసీదులో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపారు. రంజాన్ పవిత్రత దాతృత్వం, క్రమశిక్షణ, ధార్మిక చింతనలోనే ఉందని పేర్కొన్నారు. పేదవారికి సాయం చేయడం అల్లా చూపిన మార్గమని, సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొల్పాలని ఆకాంక్షించారు.
WGL: జిల్లాలోని విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ భావనను పెంపొందించేందుకు ప్రతిభ పాట పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈనెల 23వ తేదీన జిల్లా పరిపాలన భవన ప్రాంగణంలో విద్యార్థులు స్వయంగా రూపొందించిన క్రాఫ్ట్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఉత్తమ ప్రదర్శను ఎంపిక చేసి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తామని తెలిపారు.
KRNL: ఆదోని మండలం చాగి గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రమీల ఆత్మహత్య ఘటనతో విషాదం నెలకొంది. దాడి కారణంగా మనస్తాపానికి గురై ఆమె ఈ నెల 17న ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాల మహానాడు నాయకులు ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
TG: స్మార్ట్ఫోన్ ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయని చెప్పారు. వారి మాయమాటలకు ఆకర్షితులై కొందరు ఆడపిల్లలు తమ వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను పంచుకుంటున్నారని తెలిపారు. అలా ఎప్పుడూ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
PDPL: శ్రీరాంపూర్ మండలం కూనారంలో విషాదం నెలకొంది. మధునయ్య (57) మేస్త్రి పని చేస్తూ జీవనాన్ని సాగించేవాడు. ఈ ఏడాది వ్యవసాయ పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అప్పులు ఎక్కువ కావడంతో ఇవాళ ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. అనంతరం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని భార్య స్వరూప తెలిపారు.
NDL: బేతంచెర్లలోని పలు టీ, భోజనం, టిఫిన్ హోటల్లను జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇవాళ దాడులు చేశారు. పలు రకాల హోటళ్లు, తోపుడు బండ్లు, చికెన్ సెంటర్లు, టీ సెంటర్ల వద్ద డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేసినట్లు ఏవో విశ్వనాథ్ తెలిపారు. కొన్ని హోళ్లను మూసివేశారు.
MDCL: అల్వాల్ సర్కిల్ పరిధిలో ముస్లిం సోదరులు శనివారం రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం తమ ప్రాంతాలలోని మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు సయ్యద్ మోసిన్ ఆధ్వర్యంలో అల్వాల్ సీఐ ప్రశాంత్, డీసీ బోగేశ్వర్లు, ఎస్సై ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
KDP: వేంపల్లి మండలం నందిపల్లిలో వెలసిన శ్రీ నందీశ్వరాలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు నంద్యాల మురళి శర్మ ఆధ్వర్యంలో అభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. తాడిపత్రి మాజీ ఏమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు శ్రీకాంతరెడ్డి ఆయనకు స్వాగతం పలికారు.
విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభంకానున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీయన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ముడసర్లోవలో శాశ్వత ప్రధాన కార్యాలయ నిర్మాణం కొనసాగుతొందని అన్నారు.
జాతీయ రహదారుల పర్యవేక్షణ కోసం NHAI సరికొత్త AI వ్యవస్థను తీసుకువస్తోంది. ప్రత్యేక డాష్క్యామ్ కెమెరాల ద్వారా రోడ్లపై గుంతలు, ఆక్రమణలు, తదితరాలను ఈ టెక్నాలజీ ఆటోమేటిక్గా గుర్తిస్తుంది. దీనివల్ల మరమ్మతులు వేగంగా జరిగి రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. సుమారు 40 వేల కిలోమీటర్ల మేర ఈ నిఘా వ్యవస్థ ప్రయాణికులకు రక్షణగా నిలవనుంది.
WG: వాసవి పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాంతి ధామంకు ఇవాళ బెంగళూరుకు చెందిన భక్తులు తరలివచ్చారు. అమ్మవారి 90 అడుగుల పంచలోహ విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వాసవి హోమం, గోమాత పూజలలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు ఆలయ సిబ్బంది అందచేశారు.
విశాఖలోని ఏయూ 91, 92వ సంయుక్త స్నాతకోత్సవం ఈనెల 25న నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ డాక్టర్ ఎస్. అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే, ఇందులో ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్ డాక్టర్ పూర్ణచంద్రరావు పాల్గొని గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు.
KRNL: అనారోగ్యంతో ఇవాళ మృతి చెందిన రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ తండ్రి కురువ బజారి మృతదేహాన్ని ఎంపీ బస్తిపాటి నాగరాజు సందర్శించారు. గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామంలో బజారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ, మృతికి గల అనారోగ్య కారణాలను అడిగి తెలుసుకున్నారు.
కోనసీమ: రావులపాలెం మండలంలో ఇంటి పన్నుల వసూళ్లు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు ఎంపీడీవో సుబ్రహ్మణ్యం తెలిపారు. మండలంలోని ఊబలంక, వెదిరేశ్వరం, రావులపాడు గ్రామాలలో ఇంటిపన్ను వసూళ్లను ఆయన శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటి పన్ను వసూళ్లలో వెనుకబడి ఉన్న గ్రామాల్లో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, వసూళ్లపై సిబ్బందికి సూచనలు చేశారు.
KNR: రాష్ట్ర అభివృద్ధిలో మహిళా సాధికారతే అత్యంత కీలకమని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న వివో భవనం పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. మహిళా సాధికారతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు.