AKP: నక్కపల్లిలో ఈనెల 23న సీఎం చంద్రబాబు ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రకు పండగ వచ్చినట్లుగా ఉందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ఈమేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రకు చెందిన నిరుద్యోగ యువతకు స్టీల్ ప్లాంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలోని గుంటసీమ రోడ్డుపై ఓ ద్విచక్ర వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
MLG: జిల్లాలో యునిస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని శనివారం అమెరికాకు చెందిన రేటా హేంగ్, మెక్సికోకు చెందిన రోలండో అలెక్జరియా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి వారి చేత ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ గైడ్ వెంకటేష్ ఆలయ విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
వేసవి తాపాన్ని తట్టుకునేందుకు అమెజాన్ సరికొత్త ఆఫర్లతో ప్రకటించింది. మార్చి 23 వరకు అందుబాటులో ఉండే ఈ సేల్లో ప్రముఖ బ్రాండ్ల ఏసీలు, ఫ్రిజ్ల పై 65 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. బ్యాంక్ కార్డులపై అదనపు తగ్గింపుతో పాటు, నో-కాస్ట్ EMI ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. తక్కువ ధరకే ఏసీలు, ఫ్రిజ్ల కొనుగోలు చేసేందుకు ఇది మంచి అవకాశం.
W.G: బలుసులమ్మ జాతర సందర్భంగా తాడేపల్లిగూడెంలో గ్యాస్ ఇబ్బందులపై అధికారులు స్పందించారు. దీంతో నియోజకవర్గంలో గ్యాస్ కొరతను నివారించేందుకు తొమ్మిది మంది అధికారులను జాయింట్ కలెక్టర్ నియమించారు. గ్యాస్ కంపెనీల పరిధిలో వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ పొందవచ్చని సూచించారు.
రెండు నదుల మధ్య ఉన్నా నడిగడ్డ రైతులకు చుక్క నీరు అందకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ. గోపాల్ అన్నారు. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ జనసభ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆర్డీఎస్ కింద 87 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు.
HYDలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రోత్సాహానికి కీలక అడుగులు పడుతున్నాయి. 25 ఆర్టీసీ డిపోలలో ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. గ్రేటర్ పరిధిలో 2200 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం అవసరమైన ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను ఇప్పటికే అధికారులు పరిశీలించారు.
JGL: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిను బుజ్జగించే ప్రయత్నాలు బెడిసిక కొట్టినట్లు తెలుస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యం ఆయనతో గంటకు పైగా భేటీ అయ్యారు. పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తన నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం జీవన్ రెడ్డి పేర్కొనడంతో మంత్రులు అవాక్కయ్యారని సమాచారం.
MDK: చేగుంటకు చెందిన బ్రిలియంట్ స్కూల్ విద్యార్థిని హన్విత కోరుకొండ సైనిక్ స్కూల్ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో సత్తా చాటారు. ఇటీవల జరిగిన ప్రవేశ పరీక్షకు హాజరు కాగా, 223/300 మార్కులు సాధించారు. పాఠశాల కరెస్పాండంట్, ప్రిన్సిపాల్ క్రష్ణకుమార్, డైరెక్టర్లు సీహెచ్ సురేష్ కుమార్, షైక్ ఆరిఫ్, పాఠశాల ఉపాధ్యాయలు విద్యార్థిని అభినందించారు.
SDPT: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రారంభించడంపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో నిలిపివేసిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.పెండింగ్ ఉన్న రైతు రుణమాఫీ, రైతు భరోసా నిధులను విడుదల చేయాలని కోరారు.
AP: విశాఖలో నిర్వహించిన సీఐఐ వార్షిక సదస్సుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. విమానయానరంగంపై యుద్ధం ప్రభావం పడుతోందని తెలిపారు. రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతోందన్నారు. కేకేలైన్ కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. జూన్లో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కానుందని ప్రకటించారు.
వివాహ బంధంపై మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. బంధంలో కొనసాగడానికి పెళ్లి అనేది అవసరం లేదని ఆమె అభిప్రాయపడింది. పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్నవాళ్లను తక్కువగా చూశానని.. వైవాహిక జీవితంలో వచ్చే విబేధాలు, ఒత్తిడి కెరీర్పై ప్రభావం చూపిస్తాయని చెప్పుకొచ్చింది. దీంతో పెళ్లి కంటే లివ్ ఇన్ రిలేషన్షిప్కే మొగ్గుచూపుతానని తేల్చి చెప్పింది.
W.G: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన సీపీఎం ప్రజా చైతన్య పాదయాత్ర ఇవాళ 24 రోజు 600 కిలోమీటర్లు చేరుకుంది. పాదయాత్ర భీమవరం సీపీఎం కార్యాలయానికి చేరుకుంది. జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలన్ మాట్లాడుతూ.. జిల్లాలో తాగునీరు, రోడ్ల సమస్యలు, టిట్కో గ్రుహాల సమస్యలపై ప్రజల నుంచి వినతులు వచ్చాయన్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద బహిరంగ సభ జరుగుతుందన్నారు.
KMR: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు చివరి అంకమైన ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరభావం, సమానత్వం, సమైక్యతా స్ఫూర్తి సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని బోకే, శాలువాతో సన్మానించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.