• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించిన రేవంత్

TG: భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. తొలివిడతలో రూ.351 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణోత్సవంలో కుటుంబసభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

March 27, 2026 / 11:59 AM IST

మహిళ సంఘ భవనానికి భూమి పూజ

NZB: ముప్కాల్ మండలం నల్లూరులో మహిళా సంఘ భవన నిర్మాణానికి సర్పంచ్ బర్కం గంగాధర్ శుక్రవారం భూమిపూజ చేశారు. బాల్కొండ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి చొరవతో NREGS నిధులు రూ. 10 లక్షలు మంజూరైనట్లు సర్పంచ్ తెలిపారు. ఈ నిధులతో భవనాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ పాల్గొన్నారు.

March 27, 2026 / 11:57 AM IST

ఏకలవ్యలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

PPM: గుమ్మలక్ష్మీపురంలోని ఏకలవ్య పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. ఏప్రిల్ 4న ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ కాండిడేట్ ID, పుట్టిన తేదీతో వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని తప్పనిసరిగా వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు.

March 27, 2026 / 11:53 AM IST

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న మంత్రి పొంగులేటి

BDK: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను సమీక్షించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

March 27, 2026 / 11:53 AM IST

వైన్స్ బంద్.. మీ అభిప్రాయం ఏంటి?

HYD: ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో వైన్స్, బార్లను అధికారులు మూసేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? 1. మంచి నిర్ణయం2. వ్యక్తిగత స్వేచ్ఛను పరిమితం చేశారు

March 27, 2026 / 11:53 AM IST

ఎల్విన్ పేటలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు

PPM: ఎల్విన్ పేట గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీరాములవారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీరాములవారిని పల్లకిలో భక్తులు ఊరేగించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు.

March 27, 2026 / 11:53 AM IST

ఊరేగింపుగా పట్టువస్త్రాలు తీసుకెళ్లిన ఆలయ ఈవో

VSP: సింహాచలం నుంచి విజయనగరంలో రామతీర్థం సీతారాముల కళ్యాణానికి ఈఓ వెంకట్రావు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో బయలుదేరారు. సింహాద్రి అప్పన్న సన్నిధి నుంచి రామతీర్థానికి పట్టువస్త్రాలు తీసుకువెళ్లడం ప్రతి సంవత్సరం వస్తున్న ఆనవాయితీ అని అధికారులు తెలిపారు. నాదస్వర వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా పట్టువస్త్రాలు ఊరేగింపుగా తీసుకువెళ్లారు.

March 27, 2026 / 11:51 AM IST

నైబర్ హుడ్ వర్క్ స్పేస్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

పల్నాడు జిల్లాలో పారిశ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లకు వర్క్ స్పేస్‌లు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కృతికా శుక్ల తెలిపారు. ఏపీ నైబర్ భాగంగా వర్క్ స్పేస్‌లను లీజుకు ఇవ్వాలనుకునే వారు (APTS) ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. దరఖాస్తులు www.apts.gov.in వెబ్‌సైట్లో సమర్పించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 8143650320ను సంప్రదించాలని సూచించారు.

March 27, 2026 / 11:50 AM IST

మాజీ మావోయిస్టు కుటుంబానికి ప్రభుత్వ భరోసా

ASF: మాజీ మావోయిస్టు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ హరిత పేర్కొన్నారు. ఎస్పీ నితికా పంత్, ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మత్‌తో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. మాజీ మావోయిస్టు నగేష్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, భూమి పట్టా మంజూరు చేయాలని, వారి కుమార్తె ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

March 27, 2026 / 11:50 AM IST

సీతారాములవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

VZM: శ్రీరామనవమి సందర్భంగా రామతీర్థంలో శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతి సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ఎమ్మెల్సీ శ్రీనివాసుల నాయుడు, ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు.

March 27, 2026 / 11:47 AM IST

గురువు రమణయ్యకి కేసీఆర్ సంతాపం

SDPT: ప్రముఖ చరిత్రకారుడు, కేసీఆర్ గురువు జైశెట్టి రమణయ్య (85) కన్నుమూశారు. సిద్దిపేటలో కేసీఆర్ ఇంటర్ చదువుకునే రోజుల్లో హిస్టరీ బోధించిన ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కేసీఆర్ తన క్లాసులను ఎప్పుడూ మిస్ కాలేదని రమణయ్య ఒక సందర్భంలో గుర్తుచేశారు. ఒకసారి కేసీఆర్ ఇంటికి వెళ్లినప్పుడు “ఫాదర్ ఆఫ్ తెలంగాణకు స్వాగతం” అంటూ అభివర్ణించడం విశేషం.

March 27, 2026 / 11:47 AM IST

ALERT: విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్

కొవిడ్-19 కొత్త సబ్ వేరియంట్ BA.3.2 (సికాడా)ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ఇది ఒమిక్రాన్ జాతికి చెందినది. దీనికి రోగనిరోధక శక్తిని తట్టుకునే శక్తి ఎక్కువ. ప్రస్తుతం దీని తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ఇది చాలా వేగంగా సోకుతుంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

March 27, 2026 / 11:47 AM IST

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్ UPDATE

జూ.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటివరకు కేవలం 40% మాత్రమే పూర్తయినట్లు సమాచారం. నీల్ మార్క్ భారీ యాక్షన్ సీన్లు, విజువల్ గ్రాండియర్ కోసం తీసుకుంటున్న జాగ్రత్తల వల్లే ఆలస్యమవుతోందట. దీంతో NTR ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదని సినీ వర్గాలు పేర్కొన్నాయి.

March 27, 2026 / 11:46 AM IST

ఆకట్టుకున్న బాల రాముడు వేషాధారణ

SRD: నాగల్ గిద్ద మండలం కరస్ గుత్తి గ్రామంలో నేడు జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గ్రామానికి చెందిన అదిరాజ్ జైస్వాల్ బాల రాముడి వేషధారణలో అలరించాడు. వార్కారి సాంప్రదాయ భజనల కార్యక్రమంలో బాలుడు పాల్గొని భక్తిశ్రద్ధలతో భజనలు చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. అయోధ్య నుంచి బాల రాముడు దిగొచ్చినట్లు భావిస్తూ గ్రామస్తులు బాల రాముడిని దర్శించుకున్నారు.

March 27, 2026 / 11:45 AM IST

పెంబిలో రేపు వారాంతపు సంత వేలం పాట

NRML: పెంబి మండల కేంద్రంలో నిర్వహించే వారాంతపు సంత వేలం పాట ఈనెల 28న నిర్వహించడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి నరేష్, సర్పంచ్ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. వేలం పాటలో పాల్గొనాలనుకునే వారు రూ. 10 వేల డిపాజిట్ చేయాలని, గ్రామపంచాయతిలో వారికి సంబంధించి ఎలాంటి బకాయిలు ఉండరాదని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 27, 2026 / 11:44 AM IST