VZM: శ్రీరామనవమి సందర్భంగా రామతీర్థంలో శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతి సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ఎమ్మెల్సీ శ్రీనివాసుల నాయుడు, ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు.