SDPT: ప్రముఖ చరిత్రకారుడు, కేసీఆర్ గురువు జైశెట్టి రమణయ్య (85) కన్నుమూశారు. సిద్దిపేటలో కేసీఆర్ ఇంటర్ చదువుకునే రోజుల్లో హిస్టరీ బోధించిన ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కేసీఆర్ తన క్లాసులను ఎప్పుడూ మిస్ కాలేదని రమణయ్య ఒక సందర్భంలో గుర్తుచేశారు. ఒకసారి కేసీఆర్ ఇంటికి వెళ్లినప్పుడు “ఫాదర్ ఆఫ్ తెలంగాణకు స్వాగతం” అంటూ అభివర్ణించడం విశేషం.