అంతర్జాతీయ క్రికెట్ డెబ్యూకి ముందు IPLలో ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్(POTF)’ అందుకోవడం ముగ్గురికే సాధ్యమైంది. ఈ లిస్టులో తొలి ప్లేయర్ మన్విందర్ బిస్లా(KKR). 2012లోనే POTF అందుకున్న బిస్లా.. ఇప్పటికీ దేశానికి ఆడలేకపోయాడు. అటు 2014లో ఈ ఘనత సాధించిన మనీష్ పాండే(KKR).. 2015లో టీమిండియాలో చేరాడు. ఇక 2017లో POTF పొందిన కృనాల్ పాండ్యా(MI) కూడా 2018లో BCCI పిలుపు అందుకున్నాడు.
TPT: నారాయణవనం మండలం తుంబూరు గ్రామపంచాయతీలో ఫిషరీస్ పాండ్ పనులను గురువారం పథక సంచాలకులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులకు రోజుకు రూ.307 వేతనం అందే విధంగా పనులకు సరైన మార్కింగ్ ఇచ్చి క్రమబద్ధంగా పనిచేయాలని సూచించారు. ప్రతి శ్రామికుడు వంద రోజుల ఉపాధిని పూర్తి చేసుకోవాలని కూడా సూచించారు.
GNTR: అమరావతిలో ఈ నెల 11న L&T, 23న మెగా ఇంజినీరింగ్ కంపెనీల వద్ద జరిగిన అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం ప్రత్యేక బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో బృందం పనిచేయనుంది. బృందంలో నలుగురు SIలు, నలుగురు Clలు, సాంకేతిక సిబ్బంది ఉన్నారు. ఘటనలపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో తుళ్లూరు CI, DSP ఉన్నట్లు సమాచారం.
వందేభారత్ ఎక్స్ప్రెస్లో ఇచ్చిన ఆహారంలో పురుగులు రావడం కలకలం రేపింది. పట్నా నుంచి టాటానగర్కు వెళ్లే రైలులో రితీష్ కుమార్ అనే వ్యక్తి ప్రయాణిస్తున్న సమయంలో అతడికి ఇచ్చిన పెరుగులో పురుగులు వచ్చాయి. దీంతో సదరు వ్యక్తి దానిని వీడియో తీసి SMలో షేర్ చేశారు. దీనిపై సీరియస్ అయిన రైల్వేశాఖ.. IRCTCకి రూ.10 లక్షలు, సంబంధిత వెండర్కు రూ.50 లక్షల ఫైన్ విధించింది.
ఎండ తీవ్రతకు శరీరం డీహైడ్రేట్ కాకుండా క్యారెట్, దోస, టొమాటో, క్యాప్సికం వంటి కూరగాయల సలాడ్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. నిమ్మరసం, మిరియాల పొడి కలిపి తీసుకుంటే రుచితో పాటు రక్తహీనత తగ్గి శరీరం రిఫ్రెష్ అవుతుంది.
KRNL: గోనెగండ్లకు చెందిన యువకుడు పోలకల్ రాజ్ కుమార్ తన అభిమానానికి వినూత్న రూపం ఇచ్చాడు. హిమాచల్ ప్రదేశ్లోని మంచు పర్వత శిఖరంపై గడ్డకట్టే చలిని లెక్కచేయకుండా ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఫోటోను ప్రదర్శించాడు. మైనస్ ఉష్ణోగ్రతల్లో చూపిన ఈ సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
AKP: అచ్యుతాపురం మండలం మోసయ్యపేట గ్రామంలో గురువారం శ్రీసీతారాముల కళ్యాణరాట కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో రాట వేశారు. మహిళలు మంగళహారతులు పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు జరిగే శ్రీరామనవమిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పైడిరాజు, తదితరులు పాల్గొన్నారు.
MDCL: మేడ్చల్ శివారులో లగ్జరీ ఇళ్లకు భారీ డిమాండ్ పెరుగుతోంది. నగరానికి సమీపంలో ఉండటం, విశాలమైన ప్రదేశాలు, ప్రశాంత వాతావరణం కారణంగా కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నట్లు యజమాన్యాలు తెలిపాయి.ఆధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ మరింత పెరిగింది. పెట్టుబడిదారులు కూడా ఈ ప్రాంతంపై దృష్టి సారిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ 1, 2 మూవీ భారీ విజయం సాధించాయి. త్వరలోనే ‘పుష్ప 3’ రాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ చిత్రంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో ఆమె ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
HYD: సికింద్రాబాద్ EME కల్నల్ కమాండెంట్, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ సికింద్రాబాద్లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్లో అధికారులకు ఉపన్యాసం ఇచ్చారు. భగవద్గీత మతగ్రంథం కాదని, నాయకత్వం, ధర్మం, న్యాయం గురించి చెప్పే తత్వ గ్రంథమని వివరించారు. ఫలితాలపై ఆసక్తి లేకుండా కర్తవ్య నిర్వహణ, నిష్పక్షపాత నిర్ణయాలు తీసుకోవడం నేర్పుతుందన్నారు.
TPT: సత్యవేడు (M) NRఅగ్రహారంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. హేమావతికి కొద్ది రోజుల కిందట ఆడబిడ్డ పుట్టింది. అయితే ఇవాళ ఆమె కూతురుని చంపేసింది. బిడ్డ తరుచూ పాల కోసం ఏడుస్తూ ఉండడంతో నచ్చక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితురాలు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నారు.
MDCL: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే 12740 రైలు పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోగీలు, టాయిలెట్లు శుభ్రంగా లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే శుభ్రత చర్యలు తీసుకుని ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
W.G: ఉండి బస్ స్టాండ్ ఎదురుగా శ్రీ రామక్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఇవాళ ఘనంగా ఆలయ అధికారులు ప్రారంభించారు. పుజారులు సీతమ్మవారిని పెండ్లికుమార్తెగా, శ్రీరాముడిని పెండ్లికుమారుడుగా అలంకరించారు. రేపు ఉదయం సీతారామ కళ్యాణ్యం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు.
VKB: జిల్లాలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను సీజ్ చేసినట్లు SP స్నేహ మెహ్రా తెలిపారు. జిల్లా టాస్క్ ఫోర్స్ CI అన్వర్ పాషా ఆధ్వర్యంలో దాడులు చేశారు. బీదర్కు చెందిన గిరిధర్ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసి సరఫరా చేస్తున్నాడు. తాండూర్లో రేపాల శ్రీధర్ అనే వ్యాపారి 600 KGల వెల్లుల్లి పేస్ట్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
KDP: జిల్లాలో ‘సమస్య మీది – పరిష్కారం మాది’ నినాదంతో రాజంపేట నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఇంటింటి పర్యటన చేపట్టారు. ఈడిగపాలెం వార్డు-2లో ప్రజల సమస్యలు తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.