KRNL: గోనెగండ్లకు చెందిన యువకుడు పోలకల్ రాజ్ కుమార్ తన అభిమానానికి వినూత్న రూపం ఇచ్చాడు. హిమాచల్ ప్రదేశ్లోని మంచు పర్వత శిఖరంపై గడ్డకట్టే చలిని లెక్కచేయకుండా ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఫోటోను ప్రదర్శించాడు. మైనస్ ఉష్ణోగ్రతల్లో చూపిన ఈ సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.