TPT: నారాయణవనం మండలం తుంబూరు గ్రామపంచాయతీలో ఫిషరీస్ పాండ్ పనులను గురువారం పథక సంచాలకులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులకు రోజుకు రూ.307 వేతనం అందే విధంగా పనులకు సరైన మార్కింగ్ ఇచ్చి క్రమబద్ధంగా పనిచేయాలని సూచించారు. ప్రతి శ్రామికుడు వంద రోజుల ఉపాధిని పూర్తి చేసుకోవాలని కూడా సూచించారు.