AKP: అచ్యుతాపురం మండలం మోసయ్యపేట గ్రామంలో గురువారం శ్రీసీతారాముల కళ్యాణరాట కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో రాట వేశారు. మహిళలు మంగళహారతులు పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు జరిగే శ్రీరామనవమిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పైడిరాజు, తదితరులు పాల్గొన్నారు.