KDP: జిల్లాలో ‘సమస్య మీది – పరిష్కారం మాది’ నినాదంతో రాజంపేట నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఇంటింటి పర్యటన చేపట్టారు. ఈడిగపాలెం వార్డు-2లో ప్రజల సమస్యలు తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.