చిన్న పిల్లలకు లిచీ పండ్లు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖాళీ కడుపుతో లేదా దోరగా పండని లిచీలను పిల్లలకు అస్సలు తినిపించకూడదు. వీటిలో ఉండే ‘హైపోగ్లిసిన్ ఎ’ అనే టాక్సిన్ వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయి, పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. బాగా పండిన పండ్లను ఇవ్వాలి. భోజనం చేసిన తర్వాతే తినిపించాలి. గింజలు తీసేసి చిన్న ముక్కలుగా చేసి ఇవ్వాలి.
పిల్లలు డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. రోజంతా కొద్దికొద్దిగా నీటిని తాగించాలి. మజ్జిగ, కొబ్బరినీళ్లు, పుచ్చకాయ లాంటి నీటిశాతం ఎక్కువ ఉన్న పండ్లను ఇవ్వాలి. మధ్యాహ్నం పూట పిల్లలను ఎండలో ఆడకుండా చూసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేయాలి. నీరసం, పెదవులు ఆరిపోవడం లాంటి లక్షణాలు ఉంటే మరింత జాగ్రత్తపడాలి.
జుట్టు కుదుళ్లలో దురదను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. కొద్దిగా వేడి చేసిన కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి కుదుళ్లకు పట్టించి, గంట తర్వాత స్నానం చేయాలి. కలబంద జెల్ను నేరుగా స్కాల్ప్కు రాసి 20 నిమిషాలుంచితే మంట, దురద తగ్గుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్.. నీటిలో కలిపి తలకు రాస్తే ఫంగస్ నశిస్తుంది.
ఐపీఎల్ తొలి క్వాలిఫయర్లో GTను ఓడించి RCBఫైనల్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన RCB పేసర్ భువనేశ్వర్ తమ జట్టు విజయంలో ‘డేటా’ పాత్రను వివరించాడు. తాము డేటా ఆధారంగా ప్రణాళికలు రచిస్తామని, అయితే వంద శాతం దానిపైనే ఆధారపడమని చెప్పాడు. బ్యాటర్లకు అవకాశం ఇవ్వకుండా ఎల్బీడబ్ల్యూ, క్లీన్బౌల్డ్ చేయడమే తమ బౌలింగ్ వ్యూహమని భువీ పేర్కొన్నాడు.
పిల్లలు గంటల తరబడి ఫోన్లు చూడటం వల్ల కంటిచూపు, మెడనొప్పి, ఊబకాయం, నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలొస్తాయి. డిజిటల్ ప్రపంచంలో మునిగిపోతే ఒంటరితనం, కోపం పెరుగుతాయి. కాబట్టి, స్క్రీన్ టైమ్ను రోజుకు 1 గంటలోపు పరిమితం చేయాలి. ఫోన్కు బదులుగా బయట ఆడుకునే ఆటలు, పుస్తకాలు చదవడం, సృజనాత్మక అలవాట్లను ప్రోత్సహించాలి. పిల్లల కోసం తల్లిదండ్రులు ఫోన్ వాడకం తగ్గించాలి.
ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మన శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి. ఏకాగ్రత పెరుగుతుంది. రోజంతా ఉల్లాసంగా, శక్తివంతంగా పని చేయడానికి కావలసినంత సమయం దొరుకుతుంది. ఉదయం పూట ప్రశాంతమైన వాతావరణం ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఉదయం 5 గంటలకు నిద్ర లేవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రసరిత పడోత్తనాసనం (వైడ్-లెగ్డ్ ఫార్వర్డ్ బెండ్) కాళ్లను వెడల్పుగా ఉంచి ముందుకు వంగే యోగాసనం. ఇది శరీరాన్ని, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. తొడ వెనుక కండరాలు (హ్యామ్స్ట్రింగ్స్), పిక్కలు, తుంటి, చీలమండ కండరాలను బలోపేతం చేసి సాగదీస్తుంది. వెన్నెముకను సాగదీసి, వీపు కండరాలలో ఉండే బిగుతును తగ్గిస్తుంది. తల కిందికి ఉండడం వల్ల మెదడుకు, ముఖానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
* భోజనం చేసే ముందు, తర్వాత పండ్లు ఎక్కువ తినకూడదు. అలా చేస్తే పొట్ట పెరుగుతుంది* తిన్న వెంటనే టీ తాగకూడదు* తినగానే స్నానం చేయకూడదు* తిన్న వెంటనే నడవకూడదు. పది నిమిషాల తర్వాత నడవండి* తినగానే నిద్రపోకూడదు
ఎండాకాలంలో పిల్లల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని హైడ్రేటెడ్గా ఉంచకపోతే ఆరోగ్యం క్షీణించే ప్రమాదముంది. శీతల పానీయాలకు బదులుగా పండ్ల రసాలను పిల్లలకు తాగించాలి. సన్స్క్రీన్ లోషన్ రాయాలి. కాటన్ బట్టలు, వదులుగా ఉన్న బట్టలు వేయాలి. బయటకెళ్లినపుడు పిల్లలకు సన్గ్లాసెస్, తలపై టోపీ పెట్టాలి. మజ్జిగ, అంబలి వంటివి తాగించాలి.
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, రాత్రి ఆలస్యంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రి 9 దాటాక 25% కంటే ఎక్కువ క్యాలరీలు తీసుకునే వారిలో మలబద్ధకం, డయేరియా వంటి పేగు సమస్యలు 1.7 నుండి 2.5 రెట్లు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. కాబట్టి సమయానికి తినడం ద్వారా పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కొన్ని చిట్కాలతో మైగ్రేన్ సమస్యను తగ్గించుకోవచ్చు. వెలుతురు, శబ్దం లేని ప్రశాంతమైన గదిలో విశ్రాంతి తీసుకోవాలి. డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి పెరుగుతుంది, కాబట్టి తగినంత నీరు తాగాలి. రోజూ 7-8 గంటల నిద్ర, సరైన సమయానికి భోజనం తప్పనిసరి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలి. ముఖ్యంగా ఫోన్, కంప్యూటర్ స్క్రీన్ టైమింగ్ తగ్గించుకోవాలి.
జిడ్డు చర్మం, మురికి సమస్యలకు ‘యాక్టివేటెడ్ చార్కోల్’ (బొగ్గు పొడి) మాస్క్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి చర్మంపై ఉండే మృతకణాలను, దుమ్మును తొలగించి, రంధ్రాలను శుభ్రపరుస్తాయి. అతిగా విడుదలయ్యే నూనెలను నియంత్రిస్తూనే, సహజ తేమను కోల్పోకుండా చూస్తాయి. అయితే, అందరి చర్మతత్వాలు ఒకేలా ఉండవు కాబట్టి వాడే ముందు ‘ప్యాచ్ టెస్ట్’ చేసుకోవడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.
రెస్టరెంట్లలో ఆహారం నాలుకకు రుచినిచ్చినా, ఆరోగ్యానికి ముప్పే. అక్కడ వాడే నాణ్యత లేని నూనెలు, మితిమీరిన ఉప్పు, కారం, టేస్టింగ్ సాల్ట్ జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. నిల్వ ఉంచిన చికెన్, మసాలాల వల్ల ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు అవుతాయి. కాబట్టి బయట తినడం తగ్గించి, ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మంచిది.
కొందరికి చిన్న చిన్న వాటికి కోపం వస్తుంటుంది. అయితే మీ మానసిక, శారీరక స్థితిని గమనించాలి. మితిమీరిన ఒత్తిడి, సరిపోని నిద్ర, హార్మోన్ల అసమతుల్యత లేదా పోషకాల లోపం వల్ల చిరాకు, కోపం రావచ్చు. అలాగే పాత చేదు జ్ఞాపకాలు, మానసిక ఆందోళన కూడా దీనికి కారణం కావచ్చు. కోపాన్ని తగ్గించుకోవడానికి కాసేపు మౌనంగా ఉండటం, లోతుగా శ్వాస తీసుకోవడం, క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి.