• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

పరగడుపున వేప ఆకులు నమిలితే?

వేప ఆకుల్లో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. ఉదయాన్నే వేపాకులు నమిలితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. నోటి దుర్వాసనను తగ్గించి చిగుళ్లను బలోపేతం చేస్తాయి. శరీరంలోని మలినాలను తొలగించడం ద్వారా కాలేయంపై ఒత్తిడిని తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా చర్మంపై సానుకూల ప్రభావం చూపుతాయి. మొటిమలు, మచ్చలు తగ్గించి మెరిసే చర్మాన్ని పొందడానికి సహాయపడతాయి.

April 6, 2026 / 07:20 AM IST

మంచి జీర్ణక్రియకు మండూకాసనం

మండూకాసనం (కప్ప భంగిమ) జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో, టైప్ 2 డయాబెటిస్ నిర్వహణకు తోడ్పడుతుంది. పొట్టపై ఒత్తిడి కలిగించడం ద్వారా బొడ్డు, తుంటి ప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. వెన్నుముకను బలపరుస్తుంది. చీలమండల కండరాలను సాగదీసి సయాటికా నొప్పిని తగ్గిస్తుంది.

April 6, 2026 / 06:37 AM IST

ఉప్పు ఎక్కువైతే గుండెకు ముప్పే!

మనం రోజువారీ వంటల్లో వాడే సాధారణ ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చేరి రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల రక్తపోటు పెరిగి గుండె జబ్బులు, పక్షవాతం వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందుకే బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే ముందుగా ఉప్పు వాడకాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. రుచి కోసం ఉప్పును ఎక్కువగా వాడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం కంటే తగ్గించడం మేలు.

April 5, 2026 / 01:13 PM IST

40 ఏళ్లలో ఆరోగ్యాన్ని పాడుచేసే అలవాట్లు!

40 ఏళ్ల వయసులో మనుషులు తమ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. లేదంటే గతంలోని కొన్ని అలవాట్లు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. వ్యాయామం చేయకపోవడం, నిద్రలేమి, ఎక్కువసేపు కూర్చోవడం, జంక్ ఫుడ్, ఒత్తిడి, చెడు అలవాట్లు, నీళ్లు తాగకపోవడం, బరువు పెరగడం,  తరచు హెల్త్ చెకప్ చేసుకోకపోవడం వంటి అలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

April 5, 2026 / 10:59 AM IST

కప్పు కాఫీతో కాలేయ సమస్యలకు చెక్!

అమెరికాలోని సౌత్ రీసెర్చ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కాఫీలోని కెఫీన్, లివర్ సమస్య మధ్య ఉన్న సంబంధంపై పరిశోధన చేశారు. కామెర్లు, మద్యపానం అలవాటు ఉన్నవాళ్లలో కాలేయంలోని టిష్యూలు దెబ్బతింటాయి. మధుమేహ బాధితులకైతే కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల కాలేయ సమస్య వస్తుంది. కాఫీలోని కెఫీన్ ఈ ఫైబర్ కణాల ఉత్పత్తిని అడ్డుకుని కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తించారు.

April 5, 2026 / 10:45 AM IST

పరగడుపున ఈ నీరు తాగితే.. సర్వరోగాలు మాయం

ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఉసిరి, జీలకర్ర కలిపిన నీటిని తీసుకోవాలి. ఈ నీరు శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి.. అంతర్గత అవయవాలను శుభ్రపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. జీలకర్ర జీర్ణ ఎంజైములను ఉత్తేజపరుస్తుంది.

April 5, 2026 / 06:49 AM IST

గ్యాస్ సమస్యకు చెక్.. చిట్కాలు ఇవే!

కడుపు ఉబ్బరం తగ్గడానికి సరైన ఆహార అలవాట్లు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. పుదీనా టీ తాగడం, భోజనం తర్వాత సోంపు నమలడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉంటూ, పీచు పదార్థాలు తీసుకోవాలి. పాల ఉత్పత్తుల పట్ల జాగ్రత్తగా ఉంటూ, చిన్నపాటి జీవనశైలి మార్పులతో ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

April 4, 2026 / 07:58 PM IST

మృదువైన పెదవుల కోసం ఈ చిట్కాలు..!

మృదువైన పెదవుల కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే ఫలితం ఉంటుంది. రోజూ తగినంత నీరు తాగి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచాలి. నాణ్యమైన లిప్ బామ్ రాస్తూ పెదవుల పొడిబారకుండా చూడాలి. తేనె, చక్కెర కలిపి మెల్లగా పెదవులపై స్క్రబ్ చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. ముఖ్యంగా పెదవులను నాలుకతో తడపడం మానేయాలి. పడుకునే ముందు నెయ్యి లేదా బాదం నూనె రాస్తే పెదవులు కోమలంగా మారుతాయి.

April 4, 2026 / 05:00 PM IST

కర్బూజాతో ఆరోగ్య ప్రయోజనాలు

కర్బూజా వేసవిలో శరీరానికి అమృతం వంటిది. ఇందులో 90 శాతానికి పైగా నీరు ఉండటం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులోని విటమిన్ ఏ, సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మం, కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారికి, జీర్ణక్రియ సాఫీగా సాగడానికి ఇది ఉపయోగపడుతుంది.

April 4, 2026 / 01:55 PM IST

వేసవిలో చలువ చేసేందుకు ఈ డ్రింక్స్!

వేసవి తాపాన్ని తగ్గించేందుకు కొన్ని డ్రింక్స్ సహాయపడుతాయి. నీటిలో కీరా, నిమ్మ, పుదీనా కలిపి తాగితే డీహైడ్రేషన్ తగ్గుతుంది. గుప్పెడు వట్టి వేర్లను నీటిలో వేసి తాగితే ఒత్తిడి తగ్గి, శరీరం చల్లబడుతుంది. పుచ్చకాయ ముక్కలు, కీరా, పుదీనా మిశ్రమం తాగాలి. స్ట్రాబెర్రీ, నారింజలతో కలిపి చేసిన డ్రింక్ తాగితే మంచిది. గులాబీ రేకులు వేసిన నీరు శరీర వేడిని తగ్గిస్తుంది.

April 4, 2026 / 12:49 PM IST

వివాహితలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారంటే?

కొత్త కాపురంలో అడుగుపెట్టిన మహిళలు తమ సందేహాల కోసం గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. భర్త, అత్తమామల ప్రేమను ఎలా పొందాలో సెర్చ్ చేస్తున్నారు. ఉద్యోగం, ఇంటి బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసుకుంటున్నారు. పిల్లల విషయంలో సరైన సమయం కోసం వెతుకుతున్నారు. నవవధువులు తమ సమస్యల పరిష్కారానికి బయట వ్యక్తుల కంటే ఆన్‌లైన్ చిట్కాలనే ఎక్కువగా నమ్ముతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

April 4, 2026 / 12:24 PM IST

మెంతులతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

మెంతి గింజలు, ఆకులు ఆరోగ్యానికి మేలు చేసే ఔషధాల గని. వీటిలోని పీచు పదార్థం మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. గ్యాస్, మలబద్ధకం తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతుంది. చుండ్రును నివారిస్తుంది. చర్మానికి మెరుపునిస్తుంది. ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

April 4, 2026 / 11:31 AM IST

కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గాలంటే..!

కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గాలంటే సరైన జీవనశైలి ముఖ్యం. రోజూ 7-8 గంటల గాఢ నిద్ర అవసరం. ఎక్కువగా నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. కీరదోస ముక్కలు లేదా చల్లని టీ బ్యాగులను కళ్లపై ఉంచితే రక్త ప్రసరణ మెరుగుపడి నలుపు తగ్గుతుంది. పోషకాహారం తీసుకుంటూ, ఫోన్ స్క్రీన్ సమయాన్ని తగ్గించాలి. బాదం నూనెతో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

April 4, 2026 / 11:16 AM IST

వేసవిలో షుగర్ వ్యాధిగ్రస్తులు ఇవి తినండి!

నిమ్మరసం, మజ్జిగ, బత్తాయి పండ్లు, పుచ్చపండ్లు లాంటి నీరు ఎక్కువగా పండ్లను, పానీయాలను తీసుకుంటే శరీరం చల్లగా ఉండి, ఒంట్లో చక్కెర స్థాయిలు హెచ్చతగ్గులకు లోనుకాకుండా అదుపులో ఉంటాయి. దోసకాయ ముక్కలను సలాడ్‌గా తీసుకుంటే శరీరం చల్లబడుతుంది. ఇలా డయాబెటిక్ బాధితులు వేసవిలో ప్రతీ రోజూ తమ డైట్ ప్లాన్ చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

April 4, 2026 / 08:20 AM IST

విదుర నీతి: పని పూర్తయ్యేదాకా ఎవరికీ చెప్పకండి

ఒక వ్యక్తి తాను చేయబోయే పనిని, ఆలోచనలను, ప్రణాళికలను ఆ పని పూర్తయ్యే వరకు ఎవరికీ తెలియనివ్వకూడదని విదురుడు బోధించారు. ‘ఎవరైతే తమ లక్ష్యాలను, వ్యూహాలను రహస్యంగా ఉంచి.. ఆచరణలో మాత్రమే ఫలితాలను చూపిస్తారో వారే నిజమైన పండితులు. పని మొదలుపెట్టకముందే ప్రగల్భాలు పలికేవాడు ఎప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేడు’ అని విదురునీతి చెబుతోంది.

April 4, 2026 / 08:00 AM IST