బయటి తిండి కన్నా ఇంట్లో వండుకునే ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో మధుమేహం, ఊబకాయం, గుండెజబ్బుల వంటి సమస్యల ముప్పు తగ్గుతున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా బారినపడటాన్ని తగ్గిస్తున్నట్టు తాజాగా బయటపడింది. ఆహారం, శారీరక శ్రమ వంటి జీవనశైలిని మార్చుకోవటం ద్వారా డిమెన్షియా కేసులు 40% వరకూ తగ్గుతున్నాయట.
బరువు తగ్గేందుకు, ఫిట్ నెస్ కోసం జిమ్కు వెళ్తుంటారు. కొందరికేమో అంతటైం ఉండదు. అలాంటప్పుడు మన బిజీ షెడ్యూల్లో ఏడు నిమిషాలు కేటాయిస్తే ఈజీగా బరువు తగ్గొచ్చు. ఒక్కో ఎక్సర్ సైజ్ను 30 సెకన్లపాటు హై ఇంటెన్స్తో చేస్తే ఫిట్గా ఉంటాం. ఈ ఏడు నిమిషాల్లోనే కార్డియో, అప్పర్ బాడీ, లోయర్ బాడీ, కోర్ మజిల్ ఎక్సర్ సైజ్లు చేయాలి.
రోజు రోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. దీంతో వేడిని తట్టుకోలేక వీధి కుక్కలు నీడ కోసం కార్లు, పెద్ద వాహనాల కింద తలదాచుకుంటాయి. వాహనదారులు బండి స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి కింద గమనించండి.. లేదా చిన్నగా హారన్ కొట్టండి. అలాగే, మీ ఇంటి బయట చిన్న గిన్నెలో నీళ్లు ఉంచి మూగ జీవాల దాహన్ని తీర్చండి. మనం తీసుకునే ఈ చిన్న సాయం.. ఎన్నో మూగజీవుల ప్రాణాలను రక్షిస్తుంది.
చాలా మంది సెలబ్రిటీలు పరగడుపున నెయ్యి తీసుకోవడం వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరిచి, ఎసిడిటీని తగ్గిస్తుంది. ఇది పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తూ, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే చాలామంది దీనిని అలవాటు చేసుకుంటున్నారు.
మామిడి పండ్లు తిన్న తర్వాత కొంతసేపటి వరకు మంచినీళ్లు అస్సలు తాగొద్దు. అలా చేస్తే కడుపు నొప్పి, అసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాకరకాయ తీసుకుంటే వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి. మామిడి పండ్లతోపాటు చల్లటి పానీయాలు తీసుకుంటే షుగర్ లెవల్స్ మరింత పెరుగుతాయి. కారం, ఘాటు పదార్థాలు తీసుకుంటే చర్మ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.
చాలా మంది ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతుంటారు. అయిేతే, ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపులోని జీర్ణరసాలు పలచబడతాయి. దీనివల్ల ఆహారం సరిగ్గా అరగకపోవడంతో పాటు కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణ రుగ్మతలు, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆపిల్ తిన్న తర్వాత 30 నుంచి 60 నిమిషాల వరకు నీళ్లు తాగకపోవడమే ఉత్తమం. ఒకవేళ తప్పనిసరి అయితే ఒక గుక్కెడు నీళ్లు మాత్రమే తీసుకోవాలి.
అర్ధ చంద్రాసనం కాళ్లు, వెన్నెముకను బలపరుస్తూ శరీరం యొక్క సమతుల్యతను, వశ్యతను పెంచే యోగా భంగిమ. నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి, ఏకాగ్రతను మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం మెదడు, కండరాల సమన్వయాన్ని బలోపేతం చేస్తుంది. కడుపు అవయవాలను ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ భంగిమ ఛాతీ, తుంటి భాగాలను తెరిచి, వాటి వశ్యతను పెంచుతుంది.
ఉదయం పూట రోజంతా ఉత్సాహాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ‘రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన బ్రెడ్, అటుకులు, ఓట్ మీల్ వంటివి తీసుకోవాలి. గుడ్లు, పెరుగు వంటితోపాటు పీచు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. పండ్లు, ఆమ్లెట్, బాదం, అక్రోట్, సోయాపాలు, కాయగూరలు తినాలి. నూనెలో ముంచి తీసే పూరీ, వడ, బోండాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి’ అని వైద్యులు చెబుతున్నారు.
రోజులో గంటసేపు నడిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. *రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. *ఒత్తిడి తగ్గుతుంది. *మానసిక స్థితి మెరుగవుతుంది. *రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలోకి వస్తాయి. *పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. *మనసు ప్రశాంతంగా ఉంటుంది. *డోపమైన్(హ్యాపీ హార్మోన్) పెరుగుతుంది. అందుకే నడవడం మొదలుపెట్టండి. SHARE IT
*వెలుతురు, శబ్దం లేని ప్రశాంతమైన గదిలో విశ్రాంతి తీసుకోండి.*డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి పెరుగుతుంది, కాబట్టి తగినంత నీరు తాగండి.* వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం ముఖ్యం.*పౌష్టికాహారం తీసుకోండి. అల్లం టీ ఉపశమనం ఇస్తుంది.*ఫోన్, కంప్యూటర్ స్క్రీన్ టైమింగ్ తగ్గించుకోండి.
*ప్యాకెట్లు విప్పడానికి దంతాలను వాడకండి.*మంచు, పెన్నులు నమలడం వల్ల ఎనామిల్ దెబ్బతింటుంది.*పళ్లు కొరకడం, గట్టిగా బ్రష్ చేయడం మానుకోండి.*ఐస్ క్రీమ్స్, తీపి, కూల్ డ్రింక్స్కు దూరంగా ఉండండి.*పొగాకు, ధూమపానం వల్ల నోటి క్యాన్సర్ ముప్పు ఉంది.*తిన్న వెంటనే కాకుండా 30 నిమిషాల తర్వాత బ్రష్ చేయండి.
కొన్ని చిట్కాలతో కడుపు ఉబ్బరం సమస్యను తగ్గించుకోవచ్చు. శొంఠి, జీలకర్రతో తయారుచేసిన కషాయం తాగితే జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. చిటికెడు వాము, ఉప్పు కలిపి తింటే గ్యాస్ త్వరగా తగ్గుతుంది. అంతేకాదు రోజంతా తగినంత నీరు తాగాలి. జంక్ ఫుడ్, నూనె వస్తువులు, మసాలాలు తగ్గించాలి. ముఖ్యంగా సమయానికి భోజనం చేయడం, నడక వంటి అలవాట్లు ఈ సమస్యను దూరం చేస్తాయి.
21-21-21 రూల్ పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మొదటి 21 రోజులు: స్ట్రెచింగ్, జంపింగ్ జాక్స్ వంటి వ్యాయామాలు రోజుకు 20 నిమిషాలు చేస్తూ శరీరానికి శ్రమను అలవాటు చేయండి. మధ్య 21 రోజులు: కాఫీకి బదులు నిమ్మరసం, పంచదారకు బదులు బెల్లం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి. చివరి 21 రోజులు ధూమపానం, మద్యపానం, కెఫిన్ అలవాట్లను పూర్తిగా నియంత్రించండి.
ఒక బకెట్ నీటిలో మామిడి పండ్లను వేయాలి. సహజంగా పండిన పండు నీటిలో మునుగుతుంది. రసాయనాలతో పండించినవి నీటిపై తేలుతాయి. మామిడి పండ్లను తినేముందు కనీసం గంటసేపు నానబెట్టి, ఆపై బాగా కడిగి తొక్క తీసి తినడం వల్ల రసాయనాల ప్రభావాన్ని తగ్గించవచ్చు. విశ్వసనీయమైన రైతుల వద్ద లేదా సేంద్రియ పండ్లను కొనుగోలు చేస్తే ఆరోగ్యానికి మంచిది. నిగనిగలాడే పండ్లను చూసి మోసపోకుండా జాగ్రత్తలు పాటించాలి.
వేప ఆకుల్లో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. ఉదయాన్నే వేపాకులు నమిలితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. నోటి దుర్వాసనను తగ్గించి చిగుళ్లను బలోపేతం చేస్తాయి. శరీరంలోని మలినాలను తొలగించడం ద్వారా కాలేయంపై ఒత్తిడిని తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా చర్మంపై సానుకూల ప్రభావం చూపుతాయి. మొటిమలు, మచ్చలు తగ్గించి మెరిసే చర్మాన్ని పొందడానికి సహాయపడతాయి.