Gold Rates Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు ఒకరోజు స్వల్పంగా తగ్గడం, ఒక రోజు స్వల్పంగా పెరగడం అన్నట్లుగా ట్రెండ్ కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఏది ఎంత ధర ఉందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఇక్కడ చదివేయండి. దేశీయ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. గురువారం 10 గ్రాముల పసిడి ధర రూ.64,420 ఉండగా, శుక్రవారం రూ.70 పెరిగి రూ.64,490కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.64,490గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో వెండి ధరలు కూడా శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. గురువారం రూ.71,820గా ఉన్న కిలో వెండి ధర శుక్రవారం రూ.215 పెరిగింది. దీంతో ఇప్పుడు రూ.72,035కు చేరింది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర గురువారం 2037 డాలర్లు ఉండగా శుక్రవారం ఒక్కరోజులోనే పది డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం దీని ధర 2047 డాలర్లకు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి ధర(Silver Rate) 22.79 డాలర్లుగా ఉంది.