పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.వేల కోట్ల మేర మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన నీరవ మోదీకి యూకే కోర్టు షాక్ ఇచ్చింది. తనను భారత్కు అప్పగించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ వేసిన రివిజన్ పిటిషన్ను కొట్టివేసింది. ఈ కేసులో మళ్లీ విచారణ చేపట్టే పరిస్థితులు కనిపించడం లేదని తెలిపింది. దీంతో అతడిని భారత్కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది.