SKLM: పాతపట్నంలో కొలువైన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు ఇవాళ నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వాసుదేవరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయ ఛైర్మన్ సన్యాసిరావు, దేవాదాయ, రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో హుండీ లెక్కింపు జరుగుతుందన్నారు. ఆసక్తిగల భక్తులు పాల్గొనాలని కోరారు.