NLR: వలేటివారిపాలెం మండలం పొన్నలూరు మండలం మాలపాడు సరిహద్దు ప్రాంతంలో నిర్వహిస్తున్న కోడిపందేల స్థావరంపై శనివారం పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పందేల్లో పాల్గొన్న 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 కోడిపుంజులు, 23 సెల్ ఫోన్లు, రూ.42,860 నగదును స్వాధీనం చేసుకున్నారు.