NLR: అల్లూరు మండలం గోగులపల్లి, చింత చెట్ల కాలనీలో ఇవాళ పౌష్టికాహార ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ పద్మావతి మాట్లాడుతూ.. గర్భిణీలు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. శిశువుకు టీకాలు, బరువు , శిశువు ఎదుగుదల పర్యవేక్షణ అన్ని చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.