ప్రియుడిపై ప్రేయసి పెట్రోల్ పోసి చంపిన ఘటన బెంగళూరులో జరిగింది. తనను పట్టించుకోవడం లేదని ప్రియుడిపై కోపం పెంచుకుంది. వెస్ట్రన్ స్టైల్లో ప్రపోజ్ చేస్తానని నమ్మించి ఇంటికి పిలిచింది. అనంతరం కుర్చీలో కూర్చోబెట్టి చేతులు, కాళ్లు కట్టేసి కళ్లకు గంతలు కట్టి అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.