E.G: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని SI పీ.మనోహర్ హెచ్చరించారు. దేవరపల్లి పరిధిలోని NHపై మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బైక్ నడుపుతున్న రామారావు, లారీ నడుపుతున్న సుబ్రహ్మణ్యంలను పట్టుకుని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా రూ. 11, 500 జరిమానా విధించినట్లు తెలిపారు.