AP: ప్రకాశం జిల్లా ధర్మవరంలో RMP డాక్టర్ కోటిరెడ్డి(47) హత్యకు గురయ్యాడు. ముగ్గురు దుండగులు వైద్యం కోసమని అర్ధరాత్రి డాక్టర్ ఇంటి తలుపు తట్టారు. తలుపు తీయగానే కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో డాక్టర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కోటిరెడ్డి భార్య భయాందోళనతో స్పృహ కోల్పోయింది. దుండగులు మాస్కులు ధరించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.