AP: YSR కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ చోరీ జరిగింది. తిమ్మయ్య కాలనీకి చెందిన బాలిరెడ్డి కుటుంబం పెనికలపాడులోని బంధువుల ఇంటికి వెళ్లగా ఇంట్లో నుంచి 35 తులాల బంగారం, 40 తులాల వెండిని దొంగలు అపహరించారు. తలుపులు తెరిచి ఉండటాన్ని స్థానికులు గమనించి ఇంటి యజమానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.