E.G: దేవరపల్లిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నెలకొంది. వివరాల్లోకి వెళితే.. బస్టాండ్కి వచ్చిన పలువురు ప్రయాణికులు ఉదయం మృతిదేహాన్ని గమనించారు. వెంటనే దేవరపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడు తెల్ల రంగు షర్టు ధరించి ఉన్నట్లు తెలియజేశారు. కాగా అతని మృతిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.