AP: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మిలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ దిగుతూ నలుగురు బాలికలు జలపాతంలో పడిపోయారు. దీంతో ముగ్గురు మృతి చెందగా మరో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఆ బాలికను చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు హుకుంపేట మండలం జుంబువలస వాసులుగా పోలీసులు గుర్తించారు.