AP: IPL సీజన్లో ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న 15 మందిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. లాలాపేటలో 11 మంది, పాత గుంటూరులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. నిందితుల నుంచి మొత్తం రూ.2 లక్షల నగదు, 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.