MBA చదివి గోల్డ్ మెడల్ సాధించిన వంశీకృష్ణ, జల్సాల కోసం గజదొంగగా మారాడు. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 62 చోరీలు చేశాడు. దొంగిలించిన సొమ్ముతో బౌన్సర్లను పెట్టుకుని తిరిగేవాడు. అదే సమయంలో పేద పిల్లలను చదివిస్తూ మానవత్వం చాటుకునేవాడని తెలుస్తోంది. చివరికి చౌటుప్పల్ పోలీసులు వాహనాల తనిఖీలో ఇతడిని అరెస్ట్ చేసి, నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.