AP: కడప జిల్లా చక్రాయపేట మండలం కొండప్పగారిపల్లె వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లారీని ఓవర్ టేక్ చేయబోయి రెండు స్కూటీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మృతులు నాగిరెడ్డి(35), కుందా శేఖర్(45)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.