NDL: శ్రీశైలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా, వారిని అంబులెన్స్లో శ్రీశైల దేవస్థానం వైద్యశాలకు తరలించారు. రోడ్డుకు అడ్డంగా పడిన కారును తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. ప్రమాద ఘటనపై దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆరా తీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
PPM: ఆచార్య వినోబా భావే స్థాపించిన మహారాష్ట్రలోని పావనార్ ఆశ్రమం నుంచి “సర్వోదయ మండలి” సభ్యులు సద్భావన యాత్ర చేపట్టారు. ఈ యాత్ర రేపు మన జిల్లాలోకి రానుందని గాంధీజీ స్మారక నిధి ప్రధాన కార్యదర్శి నల్లా బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, అహింస, సామాజిక సామరస్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతోందని తెలిపారు.
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వై. ఓ నందలు ఇవాళ 45వ డివిజన్ సర్వేపల్లి కాలువ ప్రాంతంలో దోమల నివారణ చర్యలలో భాగంగా అత్యాధునిక డ్రోన్ల సహాయంతో మందు పిచికారి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దోమల రహిత నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతున్నామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
ASR: గుర్తేడు గ్రామంలో మొదటిసారి ప్రజాదర్బార్ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఇటీవల 5 పంచాయతీలను ప్రభుత్వం గుర్తేడు మండలంగా ఏర్పాటు చేసింది. మొదటిసారి గుర్తేడు గ్రామంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు.
ATP: జిల్లా డీఈవో ప్రసాద్ బాబు గుండె సంబంధిత సమస్యతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రసాద్ బాబు 15 రోజులు సెలవులో వెళ్లడంతో, ఇన్ఛార్జి డీఈవోగా శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు. ఆయన త్వరగా కోలుకోవాలని విద్యాశాఖ సిబ్బంది ఆకాంక్షించారు.
NDL: బేతంచెర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజలు ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ వనిత లక్ష్మి కోరారు. ప్రజలు దళారుల సహాయం లేకుండానే నేరుగా స్లాట్ బుకింగ్ చేసుకుని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా వివరాలు అందజేస్తామన్నారు.
ELR: చింతలపూడి క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై వినతి పత్రాలను సమర్పించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించిన ఎమ్మెల్యే సత్వరమే సంబంధిత అధికారులు వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
కోనసీమ: ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం వేదాంతం ఆయిల్ కంపెనీ వద్ద నిరుద్యోగులు ఆందోళన ఉదృతం చేశారు. గత నాలుగు రోజులుగా నిరసనలు తెలుపుతున్నా స్పందన లేకపోవడంతో ఇవాళ కంపెనీ జీఎం మనుకున్నా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడాది క్రితం ఇస్తానన్న 100 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
గుంటూరు నగరంలోని 56వ డివిజన్ పరిధిలోని మోతీలాల్ నగర్, రైల్వే భూములపై నివసిస్తున్న నిరుపేదల ఇళ్లను తొలగించబోతున్నారనే వార్తపై వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా స్పందించారు. పేద ప్రజల పక్షాన నిలిచిన ఆమె, బాధిత కుటుంబాలతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ను స్వయంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
KRNL: పెద్దకడబూరు PHCలో మందుల కాల్చివేతపై అధికారులు స్పందించారు. ఆదోని డిప్యూటీ డీఎంహెచ్వో సత్యవతి ఇవాళ స్థానిక పీహెచ్సీని సందర్శించారు. మందుల కాల్చివేత ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆసుపత్రిపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
అన్నమయ్య: పుల్లంపేట మండలం పుల్లంగేరు బ్రిడ్జ్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. నీటి గుంతల్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. వెంటనే స్థానికులు పోలీసులకు తెలపడంతో ఘటన స్థలానికి చేరుకుని మృతుడి పరిశీలించారు. మృతికి గల కారణాలు ఏమిటో తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
TPT: నారాయణవనం మండలంలో ఎండలు పెరిగాయి. ఈనేపథ్యంలో పాలమంగళం దక్షిణ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాలని పంచాయతీ అభివృద్ధి అధికారి ఆనంద్ కోరారు.
NLR: బుచ్చి పట్టణం ఖాజా నగర్ 7 వార్డులో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి పర్యటించారు. ధ్వంసమైన డ్రైనేజీ, అమృత్ 2.0 పథకం కింద పైప్ లైన్ ఏర్పాటుకు రోడ్లను గుంతల మయం చేసి పూడ్చలేదని ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులను సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
KDP: రాజంపేటలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ జగన్ శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి తాగునీరు, విద్యుత్, రోడ్లు, పింఛన్లు, భూ వివాదాలు వంటి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులతో చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ATP: అనంతపురం ఆర్డీటీ సేవల కొనసాగింపునకు కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సంస్థ ప్రతినిధులు మాంచో ఫెర్రర్, విశాలా ఫెర్రర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆర్డీటీ విశిష్ట సేవలు అందిస్తోందని ఎంపీ కొనియాడారు. ఈ నిర్ణయం వేలాది కుటుంబాలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు.