ATP: జిల్లాస్థాయి అండర్-19 చెస్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆదివారం స్థానిక కోవూరు నగర్లోని విద్యారణ్య పాఠశాలలో నిర్వహించనున్నట్లు చెస్ అసోసియేషన్ నాగరాజు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు 18,19 తేదీలలో అన్నవరంలో జరిగే రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. అర్హత గల క్రీడాకారులు ఆధార్ కార్డు, క్రీడా సామాగ్రితో హాజరు కావాలన్నారు.
BPT: పంగులూరు మండల పరిధిలోని రామకూరులో ఇవాళ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభకు విశేష స్పందన లభించింది. భూ రికార్డుల ప్రక్షాళన, క్షేత్రస్థాయిలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ఆదేశించిన ‘రెవెన్యూ సదస్సు’లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుంచే రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారులు చెప్పారు.
KDP: ఖాజీపేట అగ్రహారానికి చెందిన విద్యార్థిని కీర్తన మృతదేహానికి శనివారం రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నానికి పోస్టుమార్టం పూర్తి కావడంతో వైద్యులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్తనాదాలు చేస్తూ కన్నీరుమున్నీరయ్యారు. రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం అంతా విషాద వాతావరణంతో నిండిపోయింది.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్గేట్ వద్ద శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన లారీ ట్యాంకర్ ఓ కారుపై పడిన ఘటన కలకలం రేపింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే వారి పరిస్థితిపై ఇంకా స్పష్టమైన వివరాలు తెలియరాలేదు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సత్యసాయి: కొత్తచెరువులోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ సందర్శించారు. కేంద్రంలో ఉపాధ్యాయులకు కల్పించిన వసతులపై విద్యాశాఖ అధికారి కృష్ణప్పను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
కృష్ణా: గుడివాడ మండలం రామన్నపూడి గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్థులపై జరిగిన దాడిని వైసీపీ నేతలు శనివారం తీవ్రంగా ఖండించారు. గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు జరపడమే కాకుండా, వాటిని ప్రశ్నించిన స్థానికులపై దాడులకు పాల్పడడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ATP: రాప్తాడు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం సమావేశం నిర్వహించారు. ఈనెల 20న సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని అన్ని గ్రామాలు, మండలాల్లో ఘనంగా జరపాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారు.
కడపలో రూ.5 కోట్ల అభివృద్ధి పనుల టెండర్లను అధికారులు ఏకపక్షంగా రద్దు చేయడంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. జనరల్ బాడీ ఆమోదించిన పనులను నిలిపివేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించింది. కేంద్ర నిధులతో చేపట్టాల్సిన పనులు ఎందుకు ఆపారో సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేసింది. అవసరమైతే ముట్టడి, న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించింది.
TPT: వాకాడులో వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి శనివారం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. వాకాడు, కోట, చిట్టమూరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు.
SKLM: టీడీపీ పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సారవకోట మండలం టీడీపీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ చేసిన కృషి అభినందనీయం అని స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. ఇటీవల రాష్ట్ర మంత్రి లోకేష్ చేతుల మీదగా సత్కారం అందుకున్న వెంకటరమణను శనివారం నరసన్నపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.
GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మహిళా విద్యకు మార్గదర్శిగా నిలిచిన మహాత్మా పూలే సేవలు అపారమని కొనియాడారు.
SKLM: స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ CH.వివేకా నంద హెచ్చరించారు. ఈ మేరకు శనివారం డీఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు . శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో కొందరు వ్యక్తులు స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టామని ఆయన పేర్కొన్నారు.
TPT: స్థానిక గాంధీ రోడ్డులో కస్తూరిబా గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ట్రస్ట్ ఛైర్మన్ డా. P.C.రాయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో TDP రాష్ట్ర నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కస్తూరిబా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘనంగా నివాళులర్పించి సుమారు 1000 మంది పేదలకు వస్త్రదానం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
PPM: శిశు, బాలల ఆరోగ్య కార్యక్రమాలను పక్కాగా నిర్వహించి వారి ఆరోగ్యవంతమైన ఎదుగుదల ధ్యేయంగా కృషి చేయాలని రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమ జిల్లా అధికారి డా. టి.జగన్ మోహనరావు పేర్కొన్నారు. జగన్నాధపురం 30వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన సార్వత్రిక టీకా కార్యక్రమాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గడువు తేదీకి టీకా అర్హుల జాబితా పరిశీలించారు.
ELR: పీ.ఆర్ 126 రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, నాణ్యమైన గోనె సంచులు అందించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ కోరారు. శనివారం భీమడోలు మండలం గుండుగొలను సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే ధర్మరాజును కలిసి రైతు సంఘం నాయకులు సమస్యను వివరించారు.