KDP: బ్రహ్మంగారి మఠం మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీ, గ్రామాల అభివృద్ధి అంశంపై మండల స్థాయి అధికారులకు, గ్రామ సచివాలయ సిబ్బంది శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి వెంగముని రెడ్డి పాల్గొని పంచాయతీ, గ్రామాల అభివృద్ధికై పలు విషయాలను తెలియజేశారు.
KNL: సి.బెలగల్ మండలంలోని సచివాలయం-2ను, మండల విస్తరణ అధికారి ఈశ్వరయ్య స్వామి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలోని హాజరు రిజిస్టర్లను సచివాలయ సిబ్బంది పనితీరును, మూమెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. అదేవిధంగా 3 నెలలుగా డిజిటల్ అసిస్టెంట్ మెడికల్ లీవ్లో ఉన్నారని ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి, ప్రత్యమ్నయ మార్గం చూస్తామన్నారు.
NLR: రాష్ట్రంలో క్షయ వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రస్థాయి సమావేశం బుధవారం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా అడిషనల్ DMHO, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ ఖాదర్ వలీ జిల్లా సిబ్బందితో హాజరయ్యారు. క్షయ సర్వే ద్వారా బయటపడుతున్న కేసుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష జరిగింది.
సత్యసాయి: జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్ పోలీసుల క్రీడోత్సవాలను జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రారంభించారు. బుధవారం ఉదయం జిల్లా ఎస్పీ రత్నతో కలిసి కలెక్టర్ జ్యోతిని వెలిగించి క్రీడా ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన పోలీసు సిబ్బంది పలు క్రీడల్లో పాల్గొన్నారు.
NDL: ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్లో దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులు ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఇన్స్పెక్టర్ రాము పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాల క్రీడా మైదానంలో అభ్యర్థుల 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ను ఏర్పాటు సౌకర్యార్థం చేయించారు.
KDP: ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం పులివెందులలోని ఆయన నివాసము నందు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని ప్రజలు విచ్చేసి ఎమ్మెల్సీకి తమ సమస్యలను విన్నవించారు. సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.
PPM: పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామంలో ఈ నెల 23 నుండి జంఝావతి ప్రాజెక్టు సాధన యాత్ర ప్రారంభమవుతుందని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు జాగరపు ఈశ్వర ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ ప్రారంభించి ఐదు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా యాత్ర సాగుతుందన్నారు.
అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంస్థ పర్సన్ ఇన్ఛార్జ్గా కలెక్టర్ విజయకృష్ణకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల పాటు కలెక్టర్ ఇన్ఛార్జిగా ఉండాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ సంస్థలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు తెలిసిందే.
VSP: కొయ్యూరు మండలం ఆడాకుల గ్రామంలో ఈనెల 19న నిర్వహించతలపెట్టిన గ్రామ సభను రద్దు చేస్తున్నట్లు మండల తహసీల్దార్ ఎస్ఎల్వీ ప్రసాద్ బుధవారం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు మండలంలో రెవెన్యూ సదస్సులు పక్కాగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆడాకుల గ్రామ సభను గ్రామ సభ రద్దు చేశామన్నారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనేది మీడియాకు తెలియజేయడం జరుగుతుందన్నారు.
VZM: పేద దళితుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ బొండపల్లి ఎస్సై యు.మహేశ్ను మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు కొత్తలి గౌరి నాయుడు మంగళవారం రాత్రి కలిసారు. ఇటీవల మండలంలో ఉన్న రోళ్లవాక గ్రామంలో నమోదు అయిన కుల దూషణ కేసులో పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మానవ హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో సైబర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా లోన్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ లింక్ వంటి వాటిపై ఫైబర్ నేరాలు శ్రీకాకుళంలో ఎక్కువగా నమోదవుతున్నాయని డీఐజీ బుధవారం తెలిపారు. ఎప్పటికీ దాదాపు 19 కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అనుమానం ఉన్న వ్యక్తులపై 1930కి ఫోన్ చేయాలని సూచించారు.
KRNL: కోసిగి మండలంలో ‘దేవర’ పొట్టేలు రికార్డు ధర పలికింది. వందగల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి దేవర పేరు పెట్టి పెంచారు. విక్రయించేందుకు సంతకు తీసుకెళ్లగా రైతులు పోటీ పడ్డారు. రూ.20వేలతో మొదలు కాగా చివరికి రూ.1.28లక్షలకు పెద్దకడబూరు మండలంలోని బాపులదొడ్డికి చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశారు.
VZM: మెరకముడిదాం మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బందపు ఈశ్వరప్రసాద్ గరివిడి మండలంలోని కాపుశంభాం జంక్షన్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. అంత్యక్రియలను మంగళవారం ఆయన స్వస్థలం భీమవరంలో అధికార లాంఛనాలతో జరిగాయి. జవాన్ ఈశ్వరప్రసాద్ భార్య వినూత్న తలకు, కాలికి గాయాల కావడంతో ఆమె ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది.
VZN: విజయనగరం జిల్లాలో మొత్తం 507 RSK ల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ మీనాకుమారి తెలిపారు. నేటివరకు 459 RSKల ద్వారా 33,488 మంది రైతుల వద్ద నుంచి 1.57,846 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యమునకు గాను రూ.355 కోట్లను రైతులకు చెల్లించామని చెప్పారు.