• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి’

CTR: చిత్తూరు జిల్లా ప్రజలు ఆన్‌లైన్ ఆర్థిక మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ తుషార్ డూడి సూచించారు. ఫేక్ లింకులు, QR కోడ్లు, OTP మోసాల ద్వారా డబ్బులు దోచుకుంటున్నారని హెచ్చరించారు. OTP, PIN వివరాలు పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

April 4, 2026 / 02:38 PM IST

అక్రమ చోరబాట్లు అడ్డుకుంటాం: మంత్రి స్వామి

ప్రకాశం: కడలూరు బోట్ల అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. శనివారం టంగుటూరులో జరిగిన మత్స్యకారుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మత్స్యకారులకు వేట నిషేధిత భృతి ప్రభుత్వం రూ.20 వేలు పెంచిన విషయాన్ని వారికి గుర్తు చేశారు.

April 4, 2026 / 02:32 PM IST

ఆకట్టుకుంటున్న అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన

GNTR: తెనాలి ఆటోనగర్‌లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన శనివారం ఏర్పాటు చేశారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా అడుగు నుంచి 15 అడుగుల ఎత్తు వరకు ఉన్న విగ్రహాలను ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించగా ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, నన్నపనేని రాజకుమారి, వీరవల్లి మురళి వీటిని ప్రారంభించారు.

April 4, 2026 / 02:32 PM IST

‘చిన్నారులకు తప్పనిసరిగా టీకాలు వేయాలి’

NDL: పుట్టిన ప్రతి బిడ్డకు క్రమం తప్పకుండా టీకాలు వేయాలని ఇవాళ ఎంపీ హెచ్ఐఓ హుస్సేన్ రెడ్డి తెలిపారు. మహానంది మండలం అబ్బిపురం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఏఎన్ఎం సావిత్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ప్రతి తల్లిని చైతన్యపరచి, ఒక్క చిన్నారికీ టీకా మిస్ కాకుండా చూడాలని పేర్కొన్నారు.

April 4, 2026 / 02:30 PM IST

గుంజనేరులో కింగ్ ఫిషర్ పక్షి దర్శనం

అన్నమయ్య: రైల్వే కోడూరు పట్టణంలోని నరసరంపేట సమీపంలోని గుంజనేరులో శనివారం అరుదైన కింగ్ ఫిషర్ (లకుముకి పిట్ట) దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఈ విషయం తెలిసిన స్థానిక యువకులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పక్షిని వీక్షించారు. తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగుల కలయికతో అందంగా కనిపించే ఈ పక్షి నీటి దగ్గర ఉండి చేపలను ఆహారంగా తీసుకుంటుంది.

April 4, 2026 / 02:30 PM IST

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

TPT: సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. త్రాగునీరు, కరెంట్, రోడ్లు, రెవెన్యూ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 4, 2026 / 02:30 PM IST

‘జై అమరావతి’ అంటూ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

కోనసీమ: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడంపై కపిలేశ్వరపురం మండలం వల్లూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ‘జై అమరావతి’ అంటూ శనివారం ప్లకార్డులతో నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిట్టూరి వెంకట శ్రీధర్ మాట్లాడుతూ.. రాజధానిపై స్పష్టత రావడం శుభసూచకం అన్నారు.

April 4, 2026 / 02:30 PM IST

‘ప్రతీ ఒక్కరూ ఏకధాటిగా నడిచే సమయం ఆసన్నమైంది’

KRNL: టీడీపీ పార్టీలో భేదాభిప్రాయాలకు తావులేకుండా ప్రతీ ఒక్కరూ ఏకధాటిగా నడిచే సమయం ఆసన్నమైందని TDP రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఇవాళ చిన్నతుంబలంలో సర్పంచ్ పదవీ కాలం ముగిసిన సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వచ్చే స్థానిక ఎన్నికలే మనకు టార్గెటని అన్నారు. చిన్న చిన్న మనస్పర్దాలతో పార్టీకి దూరంగా ఉండటం తగదన్నారు.

April 4, 2026 / 02:30 PM IST

రామగిరిలో ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం

సత్యసాయి: రామగిరి మండలంలో దీన్‌ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. జిల్లా BJP అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలం, గ్రామ స్థాయిలో పార్టీ విస్తరణపై ఆయన కూలంకషంగా చర్చించారు. ఈ శిక్షణ తరగతుల్లో మండల నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

April 4, 2026 / 02:30 PM IST

చిన్నారికి భోజనం తినిపించిన మేయర్

నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైవో నందన్ స్థానిక వీఆర్ మున్సిపల్ పాఠశాలను శనివారం సందర్శించారు. పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా మేయర్, కమిషనర్లు తిని ఆహార నాణ్యతను పరీక్షించారు. అనంతరం మేయర్ చిన్నారులకు భోజనం తినిపించారు.

April 4, 2026 / 02:30 PM IST

జూలకంటి ఆధ్వర్యంలో అమరావతి సంబరాలు

PLD: ఏపీ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మాచర్ల నియోజకవర్గంలో శనివారం సంబరాలు నిర్వహించారు. వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు “జై అమరావతి” నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

April 4, 2026 / 02:30 PM IST

రాజధానిపై బురదజల్లడం మానుకోవాలి: ప్రభాకర్ చౌదరి

ATP: అమరావతి విషయంలో YS జగన్ పదేపదే మాట మారుస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి విమర్శించారు. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. తొలుత అమరావతికి మద్దతు తెలిపి, ఆ తర్వాత మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడారని మండిపడ్డారు. రాజధానిపై బురదజల్లడం మానుకోవాలని హితవు పలికారు. అమరావతి రైతుల పోరాటం గొప్పదని కొనియాడారు.

April 4, 2026 / 02:29 PM IST

రహదారి పనులను సమీక్షించిన మంత్రి

E.G: ఉండ్రాజవరంలో జరుగుతున్న ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి పనులను మంత్రి కందుల దుర్గేష్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు నాణ్యత ప్రమాణాలను సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

April 4, 2026 / 02:25 PM IST

పలమనేరులో ఈ-సైకిళ్ల పంపిణీ

CTR: పలమనేరు ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని వెలుగు కార్యాలయంలో 80 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు ఈ-సైకిళ్లు పంపిణీ చేసి, స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. అలాగే 499 సంఘాలకు రూ. 35.39 కోట్ల బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు.

April 4, 2026 / 02:22 PM IST

పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఏపీఆర్జేసీ పై శిక్షణ

SKLM: సారవకోట మండలం బుడితి జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులకు పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షల కొరకు ఇవాళ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి మడ్డు వెంకటరమణ పాల్గొని విద్యార్థులు ఈ అవకాశాన్ని అందుపుచ్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాము ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

April 4, 2026 / 02:20 PM IST