E.G: ఉండ్రాజవరంలో జరుగుతున్న ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి పనులను మంత్రి కందుల దుర్గేష్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు నాణ్యత ప్రమాణాలను సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.