KRNL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనానికి అర్చకులు బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. మూల బృందావనానికి అర్చకులు సుప్రభాత సేవ, వివిధ రకాల ఫలాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బంగారు కవచాలు, వివిధ రకాల పూలు, పట్టు వస్త్రాలతో బృందావనాన్ని అలంకరించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు ఇచ్చారు.
విశాఖ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఢిల్లీకి చెందిన మహమ్మద్ ముజామ్మిల్ గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద తనిఖీ చేయగా 12 కిలోల గంజాయి లభించినట్లు రైల్వే ఎస్ఐ అబ్దుల్ మారూఫ్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.
శ్రీకాకుళం రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని గుంతకల్లు నుండి డివిజన్లో భద్రతకు సంబంధించిన పనులు కారణంగా పలు రైళ్లను దారి మళ్ళిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పూరి-యశ్వంత్పూర్(22883) గరీబ్రత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ డిసెంబర్ 20 నుండి మళ్లించిన మార్గంలో నడుస్తుందని తెలిపింది.
NLR: రాపూరు మండలంలోని కండలేరు జలాశయంలో బుధవారం ఉదయం 6 గంటలకు 82.590 మీటర్ల నీటిమట్టానికి 56.656 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ మేరకు అధికారులు తాజా బులెటిన్ విడుదల చేశారు. సత్య సాయి గంగ కాలువకు 850, మొదటి బ్రాంచ్ కాలువకు 70, లోలెవెల్ స్లూయిజ్కు 10 క్యూసెక్కుల సాగునీరు విడుదల అవుతోందని ఏఈ తిరుమలయ్య తెలిపారు.
PPM: 44వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో ప్రతిభ కనబర్చిన కానిస్టేబుల్ అల్లు రామకృష్ణను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి రాత్రి అభినందించారు. స్పెషల్ పార్టీలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణను ఎస్పీతో పాటు సిబ్బంది అభినందిస్తున్నారు. ఈ క్రీడలనను కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించారు.
CTR: రామచంద్రాపురం మండలం సి.రామాపురం దగ్గర ఉన్న శ్రీబ్రహ్మశ్రీ గురుజీ ఆశ్రమంలో శ్రీ అష్టలక్ష్మి పూజలు జరుగుతున్నాయి. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మంగళవారం రాత్రి ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీబ్రహ్మశ్రీ గురుజీ ఆశీర్వాదం తీసుకున్నారు. వీరేంద్ర సెహ్వాగ్కు ఆశ్రమ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
NLR: సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు వైపు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న సిమెంటు లారీ.. బద్వేల్ నుంచి నెల్లూరుకి వెళ్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వెంటనే 108లో ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు.
NLR: స్కిల్ స్కామ్లో చంద్రబాబే అసలు సూత్రధారి అని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళగిరి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. చంద్రబాబు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో సీమెన్స్ కంపెనీకి ఇచ్చిన సొమ్ము అంతా షెల్ కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబుకే చేరేటట్టు చేశారన్నారు.
VSP: హుకుంపేట మండలంలోని రాప పంచాయతి పరిధి లివిటీ గ్రామంలో మంగళవారం రచ్చబండ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి పంచాయితీ ఉప సర్పంచ్ మోహన్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రచ్చబండ నిర్మాణం చేపట్టనుండడంతో లివిటీ గ్రామంలో గిరిజనుల రచ్చబండ కష్టాలు తీరనుందన్నారు.
ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం మైదానంలో ఈ నెల 19 నుంచి రెండు రోజుల పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థాయి జూడో బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎంఆర్డీ బలరామ్, మార్లపూడి బాలరాజు మంగళవారం తెలిపారు. పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 20 నుంచి 22 వరకు గుంటూరు ఏఎన్ యూలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు.
NLR: సూళ్లూరుపేట వేదికగా జనవరి మాసంలో నిర్వహించే పక్షులు పండుగ ను సమర్థవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుతో సూళ్లూరుపేట శాసనసభ్యులు విజయ శ్రీ చర్చించారు. ఐదు సంవత్సరాలుగా నిలిచిపోయిన పక్షులు పండుగను పక్షుల విలువ తెలిసే విధంగా ఉమ్మడి ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలు వాడ వాడల తెలియాలని తెలిపారు.
ప్రకాశం: బల్లికురవ మండలంలోని మైనర్ ఇరిగేషన్ చెరువు అయినటువంటి చెన్నుపల్లి, అంబటి పూడి గ్రామ చెరువులకు ఈనెల 21వ తేదీన రెండోసారి వేలం నిర్వహిస్తున్నట్లు మత్య్సశాఖ సహాయ పరిశీలకులు రవీంద్ర తెలిపారు. ఉదయం 10 గంటలకు చెన్నుపల్లి, మధ్యాహ్నం రెండు గంటలకు అంబడిపూడి చెరుకు సంబంధించి ఈ వేలం పాట జరుగుతుందన్నారు.
SKLM: శ్రీకాకుళంలోని డీఎల్టీసీ-ఐటీఐలో ఈనెల 19న అప్రెంటిస్ మేళా జరగనుందని డీఎల్టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై రామ్మోహన్ రావు మంగళవారం తెలిపారు. ఓ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించే ఈ మేళాకు ఐటీఐలో వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లలో ఉత్తీర్ణులైన 25సం.లోపు వయసు కలిగినవారు అర్హులన్నారు.
కృష్ణా: విజయవాడలో మంగళవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. గొర్రెల అజయ్ మంగళవారం అర్ధరాత్రి బుడమేరు బస్టాండ్ వద్ద బైకుపై వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అజయ్ స్నేహితులకు సమాచారం అందించి, ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని స్నేహితులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
W.G: నరసాపురం పట్టణంలోని వైఎన్సిలో బుధవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. లోక్మాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 95020 24765 నంబర్ ను సంప్రదించాలని అన్నారు.