CTR: పుంగనూరు పట్టణ పరిధిలోని కోనేటి పాలెం సమీపానగల అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఉదయాన్నే అర్చకులు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఫల పంచామృతాలతో అభిషేకించి, పూజలు చేశారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
కృష్ణా: ఈరోజు గన్నవరం విమానాశ్రయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కర్నూలు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి రానున్నట్లు వైసీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకుంటారు. అనంతరం వైసీపీ నాయకులతో సమావేశం అవుతారని సమాచారం.
VZM: కోరుకొండ సైనిక పాఠశాలలో 2025- 26 సంవత్సరానికి సంబంధించి 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుద లైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 20వ తేదీ చివరి గడువు. 6వ తరగతిలో బాలబాలికలు, 9వ తరగతిలో బాలురు మాత్రమే ప్రవేశానికి అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు www.aissee.nta.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ శాస్త్రి పేర్కొన్నారు.
PPM: గిరిజన విద్యార్థులు మరణాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ట్రైబల్ రైట్స్ పోరం జిల్లా అధ్యక్షులు ఐ. రామకృష్ణ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. దొరజమ్మ ఆశ్రమం పాఠశాల విద్యార్థి మరణం బాధాకరమని మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 10 లక్షలు పరిహారం చెల్లించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
NLR: గత ఐదేళ్లుగా రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉండి నెల్లూరులో పదికి పది స్థానాలు వైసీపీ కైవసం చేసుకున్నప్పటికీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో బలంగా నిలబడ్డారు. ఎవరికి భయపడకుండా టీడీపీని బలోపేతం చేశారు. వైసీపీ నాయకులను ఎదిరించి టీడీపీ కార్యకర్తలతో కలిసి పోరాటాలు చేశారని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కొనియాడారు.
SKLM: భామిని మండలంలోని వంశధార కాలువల పెండింగ్ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖరీఫ్ సీజనులో సరైన వర్షాలు లేక రైతుల పంట పొలాలకు సాగునీరు అందక నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. భామిని మండలంలో పెండింగ్ ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులను, కాలువల పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని రైతులు బుధవారం కోరుతున్నారు.
NLR: గత నెల రోజులకు పైగా గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్ల సమ్మె పోరాటంలో భాగంగా నెల్లూరు జిల్లాలోని టీచర్లు నెల్లూరు సిటీ నడిబొడ్డు స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో “బిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. తొలుత స్వతంత్ర పార్క్ వద్ద నుండి ర్యాలీగా నినాదాలు చేస్తూ గాంధీ బొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.
E.G: ఈనెల 12వ తేదీ రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో శ్రీకాకుళం ఎస్సైపై దాడి చేసి పరారైన 18 మందిలో 13 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు ముద్దాయిలు ఇంకా పరారీలోనే ఉన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు వివరాలు వెల్లడించారు.
నెల్లూరులో జికా వైరస్ కలకలం రేపింది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడుకి జికా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దాంతో ఆ బాలుడిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైరస్ నిర్ధారణ తర్వాత బాలుడిని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
PPM: పార్వతీపురం మండలంలోని చినబొండపల్లి గ్రామంలో ఉన్న ఊర చెరువు ఆక్రమణకు గురైంది. ఈ చెరువు కిందసుమారు 205 ఎకరాల ఆయుకట్టు ఉంది. చెరువుగట్టుపై స్థానికులు పశువులు శాలలు ఇంటి నిర్మాణాలు చేపట్టి చెరువుగట్టును ఆక్రమించారు. రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ASR: గూడెం కొత్తవీధి మండలంలోని ఆర్వీ నగర్ గ్రామంలో సుమారు ఏడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన ఒడిశాకు చెందిన లారీ డ్రైవర్ తరుణ్ హల్దార్కు పదేళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు సీఐ పీ.వర ప్రసాద్ బుధవారం తెలిపారు. 2017 లో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల లారీ ఓ దుకాణంపైకి దూసుకొని వెళ్లింది.
ATP: గుత్తిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో బుధవారం ధనుర్మాస పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బంగారు వెండి ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయంలో అమ్మవారికి అష్టోత్తర, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.
నెల్లూరులోని కలెక్టరేట్లో పలు శాఖల పనితీరుపై అధికారులతో మంత్రుల సమీక్ష సమావేశం జరిగింది. కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రెవెన్యూ సదస్సుల గురించి గ్రామాల్లో ప్రచారం చేయాలని, నోషనల్ ఖాతాల పరిధిని ఆర్డీవో స్థాయికి తీసుకురావాలని కోరారు.
KDP: కొండాపురం మండలంలోని పి.అనంతపురం గ్రామ సమీపంలో నీల మల్లేశ్వర కొనలో నాగ ప్రతిమ చోరీ జరిగింది. సోమవారం కొందరు శివ భక్తులు మాల వేసుకున్నారు. అక్కడికి వచ్చిన వారిలో గుర్తు తెలియని భక్తులు 2 కిలోల బరువు గల నాగపడిగ ప్రతిమను చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగపడిగ ప్రతిమ విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని భక్తులు తెలిపారు.
NLR: వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీలో పనిచేసిన వారికి టీడీపీలోకి నో ఎంట్రీ అంటూ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వాక్యానించారు. వైసీపీ పార్టీ వారు ఎవరూ నా దగ్గరకు రాకండి, మా గడప తొక్కకండి. టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళ అంతు చూస్తాం. వెంకటగిరి పట్టణంలో అక్రమ కట్టడాలను కూడా త్వరలో కూల్చేస్తాం అని వ్యాక్యానించారు.