• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అవినీతి యాజమాన్యాన్ని రద్దు చేయాలి

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనను పాల రైతుల సంఘం ప్రతినిధులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ డైరీ పాల రైతుల సమస్యల పై ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. విశాఖ డైరీను సహకార చట్టం పరిధిలోకి తీసుకురావాలాని కోరారు. అవినీతి యాజమాన్యాన్ని రద్దు చేసి ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపి రైతులను ఆదుకోవాలన్నారు.

December 18, 2024 / 01:09 PM IST

ఇల్లు మంజూరు కొరకు దరఖాస్తు చేసుకోండి

PPM: ఆవాస్ ప్రధానమంత్రి యోజన(పీఎంఏవై2.0) పథకం కింద అర్హత కలవారు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అర్హత కలిగి గతంలో ఇల్లు మంజూరు కాని వారు ఇల్లు మంజూరు చేయటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. సచివాలయం వద్ద ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

December 18, 2024 / 01:07 PM IST

క్లాప్ మిత్రలకు అవగాహన సదస్సు

ప్రకాశం: బల్లికురవ మండల పరిషత్ కార్యాలయంలో ఐటీసీ బంగారు భవిష్యత్తు సెర్చ్ వారి ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామ పంచాయతీల నందు పారిశుద్ధ్య పనులు నిర్వహించే క్లాప్ మిత్రలకు, పంచాయతీ కార్యదర్శులకు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.

December 18, 2024 / 01:04 PM IST

విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ నిరసన

ATP: డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం నగరంలోని అంబేద్కర్ సర్కిల్‌లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో బుధవారం మోకాళ్లపై నిల్చుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు హనుమంతరాయుడు మాట్లాడుతూ యువ గళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలన్నారు.

December 18, 2024 / 01:03 PM IST

జిల్లాకు చేరుకున్న వైఎస్ జగన్

KRNL: మాజీ సీఎం వైఎస్ జగన్ కర్నూలు శివారులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో ఆయన నగరంలోని GRC కన్వెన్షన్లో జరిగే YCP నేత తేర్నేకల్ సురేందర్ రెడ్డి కుమార్తె రిసెప్షన్ వేడుకలకు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం కర్నూలు నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి.

December 18, 2024 / 01:02 PM IST

గుట్టూరులో విద్యార్థులకు మోడల్ పేపర్స్ పంపిణీ

SS: పెనుకొండ మండలం గుట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు బుధవారం SSC మోడల్ పేపర్స్ పంపిణీ చేశారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో గుట్టూరు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ సౌకర్యంతో 60 మంది విద్యార్థులకు మోడల్ పేపర్లను ఉచితంగా పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు.

December 18, 2024 / 01:02 PM IST

ఎంపీపీ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మృతి

KRNL: యూటీఎఫ్ సీనియర్ నాయకుడు, నాగలదిన్నె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం బాబురాజు బుధవారం అనారోగ్యంతో మృతి మరణించారు. ఆయన కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతన్నారు. ఇవాళ మరణించడంతో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడిగా, హెచ్ఎంగా ఆయనందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.

December 18, 2024 / 01:00 PM IST

గోడను ఢీకొట్టిన బస్సు

ప్రకాశం: దర్శిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు దర్శి మార్కెట్ యార్డ్ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రయాణికులు ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటన స్ధాలని చేరుకుని దర్యాప్తు చేశారు. 

December 18, 2024 / 01:00 PM IST

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి: టీజీ వెంకటేశ్

KRNL: సంకల్భాగాని హరిహర క్షేత్రంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కోరారు. బుధవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి 19వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల ఆహ్వాన కరపత్రాన్ని ఆయన హరిహర క్షేత్రంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. హరిహర క్షేత్రాన్ని 30సంవత్సరాల క్రితం బ్రాహ్మణుల సహకారంతో నిర్మించామని అన్నారు.

December 18, 2024 / 01:00 PM IST

నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంపై కలెక్టర్ స్పందించాలి

VZM: బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో జరుగుతున్న నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న డిమాండ్ చేశారు. ఇందిరమ్మ కాలనీలో బుధవారం నిరసన తెలిపారు. భూ కబ్జాలు, నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేస్తున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

December 18, 2024 / 12:59 PM IST

సబ్ స్టేషన్ ఎదుట ప్రజాసంఘాల నిరసన

ELR: జంగారెడ్డిగూడెం స్థానిక పంగిడిగూడెం రోడ్డులో ఉన్న విద్యుత్ కార్యాలయం ఎదుట బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ బిల్లులను దహనం చేశారు. మండల కార్యదర్శి జీవరత్న మాట్లాడుతూ.. ట్రూ అప్ చార్జీల పేరుతో విధించిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ నిలుపుదల చేయాలన్నారు.

December 18, 2024 / 12:59 PM IST

అదనపు తరగతి గదులు ప్రారంభించిన మంత్రి బీసీ

NDL: బనగానపల్లె పట్టణంలోని తెలుగుపేట మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి బీసీ స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి.. పాఠశాలల్లోని సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

December 18, 2024 / 12:57 PM IST

కొయ్యలగూడెంలో ఇంధన పొదుపు వారోత్సవాలు

ELR: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా కొయ్యలగూడెంలో బుధవారం విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల విద్యార్థులు, విద్యుత్ ఏడీ కార్యాలయం నుంచి ప్రధాన కూడలి వరకు అవగాహన ప్రదర్శన చేసి పోలీస్ స్టేషన్ కూడలిలో మానవ హారం నిర్వహించారు. కరెంటు ఆదా చేద్దాం, భావితరాలకు భరోసానిద్దాం, విద్యుత్ ఆదా చేద్దాం అని అన్నారు.

December 18, 2024 / 12:54 PM IST

మార్కెట్‌లో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

VZM: మార్కెట్‌లో జరుగుతున్న కల్తీలు, మోసాలు, అబద్ధపు ప్రకటనల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో వినియోగదారుల చైతన్య సదస్సును బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా యువత చైతన్యవంతమైన వినియోగదారులుగా మారాలన్నారు.

December 18, 2024 / 12:52 PM IST

భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: ఆర్డీవో

CTR: బగుడుపల్లి మండలం యామిగానిపల్లి పంచాయతీలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కుప్పం ఆర్డీవో శ్రీనివాసరాజు, తహసీల్దార్ సీతారాం పాల్గొన్నారు‌. రైతులు, ప్రజల నుంచి భూ సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని ఆర్డీవో స్పష్టం చేశారు‌‌. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని‌ సూచించారు.

December 18, 2024 / 12:45 PM IST