ATP: గార్లదిన్నె మండలం కల్లూరు-తాటిచెర్ల రైల్వే సెక్షన్ పరిధిలో రైల్వే ట్రాక్ మరమ్మత్తుల కారణంగా రేపటి నుంచి నాలుగు రోజులపాటు రైల్వే గేటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. కావున కోటంక, పెనకచర్ల, పెనకచర్ల డాం మార్గం వెళ్లే వాహనదారులు గమనించవలసిందిగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారి రవిబాబు విజ్ఞప్తి చేశారు.
CTR: పుంగనూరు గ్రామాలలో మౌలిక వసతుల కల్పనపై ప్రణాళిక రూపొందించేందుకు స్థానికీకరణ సుస్థిరతకు ఈ శిక్షణా తరగతులు ఎంతో ఉపయోగపడతాయని ఏవో రెడ్డమ్మ తెలిపారు. బుధవారం పుంగనూరు పట్టణంలోని జడ్పీ అతిథిగృహంలో సర్పంచ్లు, సచివాలయ సిబ్బందికి శిక్షకులు శిక్షణ ఇచ్చారు. పంచాయితీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం చేపట్టవలసిన అంశాలపై వివరించారు.
ELR: గణపవరం మండల విద్యాధికారి-1గా ఎన్ రాజేష్ బుధవారం ఎంఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా ఉంటూ వీరవాసరం మండలం ఎంఈవో-1గా అదనపు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంఈవో రాజేష్ని ఎంఈవో-2 గొర్రెల బాలయ్య, పెంటపాడు ఎంఈవో-2 టీవీ రామకృష్ణ, ఎంపీడీవో బేబీ శ్రీలక్ష్మి, పలువురు పుష్పగుచ్చాలతో అభినందించారు.
NTR: ఏ కొండూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పీ హరిప్రియ(36) గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. ప్రసవ సమయంలో పాపకు జన్మనిచ్చి ఎంపీడీవో హరిప్రియ మృతి చెందడం జరిగింది. హరిప్రియ మృతికి సంతాప సూచకంగా ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది మౌనం పాటించారు. ప్రజలతో మమేకం అవుతూ, ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో హరిప్రియ ముందుండేవారన్నారు.
PLD: జనసేన పార్టీ కార్యకర్త బొమ్మిరెడ్డి రామకృష్ణ ఇటీవల అనారోగ్య కారణాలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం విషయం తెలుసుకున్న మండల జనసేన అధ్యక్షుడు పాముల కిషోర్, జనసేన సీనియర్ నాయకుడు ఆవుల శ్రీను, జన సైనికుడు రామకృష్ణకు రూ.10,000ల నగదును అందజేశారు. కార్యక్రమంలో మండలంలోని జనసేన నేతలు తోట నాగేశ్వరరావు, బత్తుల వెంకయ్య పాల్గొన్నారు.
ASR: ఔట్సోర్సింగ్ విధానం రద్దుచేసి సీఆర్టీలుగా నియమించాలని కోరుతూ కూనవరం గురుకుల పాఠశాల ఎదుట పలువురు ఉపాధ్యాయులు బుధవారం బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఔట్సోర్సింగ్ విధానం వద్దు, సీఐఆర్టీ విధానం ముద్దు అంటూ నినాదాలు చేశారు. మహిళా ఉపాధ్యాయులు తమ పిల్లాపాపలతో పాఠశాల ఎదుట కూర్చుని ఈ నిరసనలో పాల్గొన్నారు.
PLD: మంగళగిరి పానకాల స్వామిని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఎమ్మెల్యేకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ, ప్రసాదాలను అందజేశారు. స్వామివారి దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
VZM: విజయనగరంలో ప్రముఖ సినీనటి శ్రీ లీల సందడి చేసింది. జిల్లాలో స్థానిక NCS రోడ్డులో గల ది చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభానికి బుధవారం ఆమె విచ్చేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెను చూడటానికి భారీగా తరలివచ్చారు. ఈమేరకు అభిమానులుతో సరదాగా ఆమె సెల్ఫీలు తీసుకున్నారు. ప్రస్తుతం రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి పాల్గొన్నారు.
KRNL: వైసీపీ నేత కుమార్తె వివాహం నిమిత్తం కర్నూలుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రాలయం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై కొద్దిసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం వైసీపీ మండల కన్వీనర్ భీమ్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
VSP: ఈ నెల 28, 29వ తేదీల్లో సుజాత నగర్లో సీపీఎం జిల్లా మహాసభలు జరగనున్నాయని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.జగ్గునాయుడు తెలిపారు. బుధవారం జగదాంబలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 28న ఉదయం 10 గంటలకు పెందుర్తి జూనియర్ కళాశాల నుంచి సుజాత నగర్ వరకు భారీ ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ ప్రదర్శన, బహిరంగ సభను ప్రజలు, కార్మికులు విజయవంతం చేయాలన్నారు.
VSP: ప్లాస్టిక్ వాడి అనారోగ్యానికి గురి కావద్దని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమకుమార్ అన్నారు. బుధవారం ఈస్ట్ పాయింట్ కాలనీలో విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. డీఈవో మాట్లాడుతూ.. ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. కావున ప్లాస్టిక్కు దూరంగా ఉండాలని చెప్పారు.
ప్రకాశం: ప్రభుత్వం ఎంతో కీలకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తుకు అధికారులు జవాబుదారీతనంగా ఉంటారని మండల తహసీల్దార్ రవిబాబు అన్నారు. బుధవారం మండలంలోని పాతమాగులూరు పుట్టవారి పాలెం గ్రామాలలో రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
KDP: మండల కేంద్రమైన దువ్వూరు-1 గ్రామ సచివాలయం పరిధిలో రబీ సీజన్లో సాగైన పంటలను నమోదు చేయించుకోవాలని వ్యవసాయ అధికారి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. రైతు సేవా కేంద్రంలో ఉన్న వ్యవసాయ సిబ్బందిని సంప్రదించి మినుము, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, శనగ ఇంకా ఇతర పంటలను రైతులు ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని వ్యవసాయాధికారి కోరారు.
ATP: ఉమ్మడి జిల్లాల నేతలతో మాజీ సీఎం జగన్ రేపు సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీటింగ్ జరగనుంది. జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారని వైసీపీ ప్రకటన విడుదల చేసింది.
ASR: రాజవొమ్మంగి మండలం శరభవరంకి చెందిన డిగ్రీ విద్యార్థి కే అఖిల వెంకట సాయి భూదరాళ్ల వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. లంబసింగి విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా భూదరాళ్ల ఘాట్ రోడ్లో బైక్ బోల్తా కొట్టి తీవ్ర గాయాలు పాలైన ఇతన్ని నర్సీపట్నం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఆ గ్రామస్తులు తెలిపారు.