E.G: రాజానగరం మండలం పాత తుంగపాడు గ్రామంలో శ్రీకనక దుర్గమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. కనకదుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో వైసీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
VZM: చీపురపల్లి జి.అగ్రహారంలో ఉంటున్న ఆదిబాబు బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మేరకు కుటుంబసభ్యులు వారి నేత్రాలను దానం చేయాలని నిర్ణయించుకుని రెడ్క్రాస్ కో ఆర్డినేటర్ గోవింద రాజులుకు తెలిపారు. దాంతో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ సుజాత, ఉమ శంకర్ ద్వారా అతని కార్నియాలు సేకరించి, విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి ఇచ్ఛారు.
CTR: వెదురు కుప్పం మండలం యనమల మంద గ్రామానికి చెందిన గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నరకాల కుప్పం సుధాకర్ ఇటీవల అనారోగ్యంతో వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
KDP: నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న అదనపు మునిసిపల్ కార్మికుల వేతనాలు, డిమాండ్లను పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మునిసిపల్ కార్మికులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా లాంటి కష్ట కాలంలో కూడా పని చేసిన తమను విస్మరించడం దారుణమన్నారు.
KRNL: రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సాధారణ విద్యార్థులు సైతం అసాధారణమైన ఫలితాలు సాధించేలా మోడల్ ప్రశ్నపత్రాలను నేమకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగన్నతో పాటు ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆవిష్కరించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు సులభతరమైన పద్ధతిలో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్ )వారి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
TPT: తిరుమలలో బ్రేక్ దర్శనాల టికెట్ల బ్లాక్ మార్కెట్ దందా వెలుగు చూసింది. బ్రిగేడియర్ పేరుతో ఎన్సీసీ క్యాంటిన్ మేనేజర్ బ్రేక్ దర్శనాల టికెట్ల విక్రయం కలకలం రేగింది. 4 బ్రేక్ దర్శనాల టికెట్లను రూ.40 వేలకు మేనేజర్ బ్రహ్మయ్య విక్రయించినట్లు విజిలెన్స్ తనిఖీల సమయంలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. దీంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
PLD: నరసరావుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు సమ్మేట్- వన్ పరీక్ష పత్రాలను బుధవారం డిప్యూటీ డీఈఓ ఏసుబాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో భద్రపరిచిన ప్రశ్నాపత్రాలను ప్రధానోపాధ్యాయులకు అందించారు. ఇతరులను పరీక్ష గదుల్లోకి అనుమతించ వద్దన్నారు. సెల్ ఫోన్లను తీసుకురావద్దన్నారు.
SKLM: ఎచ్చెర్ల మండలం కుశాలపురం వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంటర్ పాలిటెక్నికల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలను బుధవారం ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థి ఉన్నత వ్యక్తిత్వానికి దోహదపడతాయన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జానకి రామయ్య, తదితరులు ఉన్నారు.
PLD: మైనార్టీ హక్కుల సాధన కోసం పోరాటాలు చేస్తామని ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి అన్నారు. బుధవారం పార్టీ నూతన సంవత్సర గోడ పత్రికలను, క్యాలెండర్లను నాయకులు ఆవిష్కరించారు. రాష్ట్రంలో మైనార్టీల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు.
ATP: పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ ఢిల్లీలో బుధవారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కేంద్రమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ELR: భీమడోలులో జరిగిన రెవెన్యూ సదస్సులో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు బుధవారం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామాలలోని భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లయితే వాటిని పరిష్కరించడం జరుగుతుందనన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గం కాపవరం గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటుచేసిన నంది విగ్రహాన్ని బుధవారం కార్మిక శాఖ మంత్రి సుభాష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గ్రామస్తులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు పాల్గొన్నారు.
ELR: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లోని రాగి వైర్లను దొంగిలిస్తున్న ముఠాను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ.. ద్వారకాతిరుమల, భీమడోలు, లక్కవరం, తడికలపూడి టీ.నర్సాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 41 ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైరు చోరీ చేస్తున్న ముగ్గురుని అదుపులోకి తీసుకొని 639 కేజీల రాగిణి స్వాధీనం చేశారు.
NLR: సంగం మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం సుస్థిరాభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులకు రెండు రోజుల శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. గ్రామంలో పేదరిక నిర్మూలన, జీవనోపాదుల కల్పన వంటి సంకల్పాలతో, ప్రణాళికలతో గ్రామపంచాయతీలు ముందుకు సాగాలన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
ASR: జాతీయ గణిత దినోత్సవంను పురష్కరించుకొని అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్ధులకు వ్యాచరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో 30 మంది విద్యార్థులు పాల్గొన్నారని గణితశాస్త్ర విభాగాధిపతి డా పి కొండబాబు తెలిపారు. గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం జయంతి డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటారని ప్రిన్సిపాల్ డా నాయక్ తెలిపారు.