E.G: హిందూ దేవాలయాల భూములను రక్షిస్తూ.. శిధిలావస్థలో ఉన్న ఆలయాలను పున: నిర్మించాలని BJP జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర కోరారు. ఇవాళ రాజమండ్రిలోని కలెక్టర్ వద్ద నిర్వహించిన PGRSలో వినతి పత్రం అందజేశారు. హిందూ ఆలయ భూములు ఇతరులకు చేతుల్లోకి వెళ్ళటం అంగీకారయోగ్యం కాదని, ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఆలయ నిర్మాణాలకు సహకరించాలని కోరారు.