KRNL: దళితులపై దాడులు అమానుషమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు మేకల భిక్షం శనివారం అన్నారు. జిల్లా పర్యటనలో ఆదోనిలో ప్రజల వినతులు స్వీకరించి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని అధికారులకు వెల్లడించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, డీఎస్పీ భార్గవి పాల్గొన్నారు.