AKP: స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అచ్యుతాపురంలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రతి మూడు నెలలకు ఒక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నేడు నిర్వహించిన జాబ్ మేళాలో 600 మంది ఉద్యోగాలు పొందనున్నట్లు తెలిపారు.
KDP: వీరబల్లిలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో సుమారు 70 మందికి పరీక్షలు నిర్వహించారు. 22 మందికి కాటరాక్ట్ ఆపరేషన్ అవసరమని గుర్తించి కడపకు తరలించగా, 30 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని పుష్పగిరి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
కోనసీమ: ఈ నెల 27న ఉదయం 10:30 గంటలకు అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధి ఆఫీస్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రముఖ సంస్థల్లో వివిధ ఉద్యోగాలకు ఎస్ఎస్సీ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలకు 8978905032 ను సంప్రదించాలన్నారు.
NLR : బుచ్చిరెడ్డి పాలెం మండలం మినుగల్లు గ్రామంలో రైతులతో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ముచ్చటించారు. ధాన్యం కొనుగోలు ధరలు మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన ధాన్యానికి 24 గంటల్లో నగదును జమ చేస్తున్నామన్నారు. రైతులు పలు సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
సత్యసాయి: విదేశీ పక్షుల సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం చిలమత్తూరు మండలం వీరాపురంలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్బంగా వేసవి విడదికి వచ్చే సైబీరియన్ పక్షులకు అవసరమైన ఆహారం, నీరు సమకూరుస్తాం అన్నారు. చెట్ల పై నుంచి కింద పడే పక్షి పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక సంరక్షకుడిని నియమించాం అన్నారు.
CTR: త్వరలో పదవీకాలం ముగియనున్న సర్పంచ్లకు వీకోట ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ యువరాజ్ వారిని ఘనంగా సన్మానించారు. పదవీకాలం ముగిసిన ప్రజాసేవలో ముందుండాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. వారికి బకాయి బిల్లులను ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ATP: తాడిపత్రి పట్టణంలోని హెచ్.పి గ్యాస్ ఏజెన్సీని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ బుధవారం తనిఖీ చేశారు. వేజ్ ఎంటర్ప్రైజెస్ రిజిస్టర్లను పరిశీలించి, గత 15 రోజుల బుకింగ్లు, డెలివరీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సరఫరా సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. అనంతరం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.
అన్నమయ్య: రాజంపేటలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణంపై అధికారులు, బాధితులతో కీలక సమావేశం నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ.. అభివృద్ధితో పాటు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయే వారికి నష్టపరిహారం అందించడంతో పాటు దుకాణదారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
TPT: తిరుపతి కొర్లగుంటలో జరిగిన జననగణన-2027 క్షేత్రస్థాయి శిక్షణ కార్య క్రమాన్ని కమిషనర్ ఎన్.మౌర్య పరిశీలించారు. ఎన్యుమరేషన్ యాప్ వినియోగంపై సిబ్బందికి సూచనలు చేశారు. నగరంలో 800 ఎన్యుమరేటర్లు, 150 సూపర్వైజర్లు నియమించామని తెలిపారు. ఏప్రిల్ 8 నుంచి తదుపరి శిక్షణ, మే నుంచి గణన ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
ప్రకాశం: గుడ్లూరుకు చెందిన ఓ మహిళ బస్సులో మరిచిపోయిన సుమారు రూ.2 లక్షల విలువైన గోల్డ్ బ్రాస్లెట్ను మరిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసు బస్సు సిబ్బందిని సంప్రదించగా, కండక్టర్ చంద్రమోహన్ రావు ఆభరణాన్ని భద్రంగా ఉంచి గుడ్లూరు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి బాధితురాలికి అప్పగించాడు. దీంతో సదరు మహిళ కుటుంబ సభ్యులు కండక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.
SKLM: జైళ్లలో కుల వివక్షకు తావుండ కూడదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. బుధవారం అంపోలులోని జిల్లా జైలును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డితో పాటు ‘బోర్డ్ ఆఫ్ విజిటర్స్’ బృందంతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో అందరికీ సమాన సౌకర్యాలు అందాలని అధికారులను ఆదేశించారు
PLD: సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామంలో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని బుధవారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. రూ.3 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని విమర్శించారు.
PPM: విక్రంపురంలో ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగుల ఆరోగ్య తనిఖీ రికార్డులు, వైద్య పరీక్ష పరికరాల పనితీరు, మందుల లభ్యతపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ, వారి ఆరోగ్యం మెరుగుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.
BPT: అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు నమోదు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఓటరు నమోదు అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (KORGRP R&R యూనిట్, ఒంగోలు) విజయ జ్యోతి కుమారి అధ్యక్షత వహించారు. సమావేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ ప్రక్రియపై వివరించారు.
KRNL: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు బుధవారం తెలిపారు. రూ.1.36 లక్షల కోట్లతో ఏర్పడనున్న భారీ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టుతో లక్ష మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ చొరవతోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు.