PLD: సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామంలో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని బుధవారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. రూ.3 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని విమర్శించారు.