Vangalapudi Anitha : టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత నోరు జారారు. టీడీపీ నేత అయ్యి ఉండి... జగన్ మళ్లీ సీఎం కావాలంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆమె నోరు జారడాన్ని వైసీపీ నేతలు తమను అనుకూలంగా చేసుకోవడం గమనార్హం.
జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి త్వరలోనే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ నేతృత్వంలో ఈ కమిటీని ప్రకటించనుంది.
నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham) కింద ఒక్కో అకౌంట్లో రూ.15వేల జమచేయనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే సభలో సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
బంతి బంతికీ, ప్రతి ఓవర్ కు.. ఇలా రకరకాలుగా బెట్టింగ్ లు చేస్తున్నారు. పంటర్లు నిర్వాహకులు ముందుగా చెప్పిన బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపాలి. గెలిచినా.. ఓడినా.. తెరపై కనిపించేలా ఏర్పాట్లు చేశారు.
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ (AP Intelligence Chief) సీతారామాంజనేయులుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి (MLA Kotam Reddy) శ్రీదర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక రాజకీయ దళారీగా మారారని కోటంరెడ్డి త్రీవ స్థాయిలో విమర్శించారు.ఆయన వ్యవహారశైలి బాగోలేదన్నారు.ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) తో రామోజీరావుపై ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టించేందుకు రామాంజనేయులు ప్రయత్నిస్తున్నారని కోటంరెడ్డి ఆర...
ఏపీలో రోడ్లు, ఆస్పత్రులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో తెలంగాణకు ఏపీకి చాలా వ్యత్యాసం ఉంది. మరి ఇక్కడ ఉంటారా? అక్కడ ఉంటారా? మీకు ఇక్కడే మంచిగా ఉంది కాదా?’
శ్రీశైల మహాక్షేత్రం (Srisailam Temple)లో భ్రమరాంభ అమ్మవారి(Bhramaraambha) వార్షిక కుంభోత్సవ సాత్విక బలి ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి గ్రామదేవత అంకాలమ్మ(Ankaalamma)కు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
Lakshmi Parvathi : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ , ఆయన అల్లుడు , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫై తెలుగు సంస్కృతం అకాడమీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతీ సెటైర్స్ విసిరారు .. తిరుపతిలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు ..
ఏపీ(AP) ప్రజలకు రాష్ట్ర సర్కార్ శుభవార్త (Good news) చెప్పనుంది. ఇప్పటి వరకూ రేషన్ సరుకుల(Rationgoods)ను ఇంటి వద్దకే వెళ్లి అందిస్తోన్న సర్కార్ త్వరలోనే మరికొన్ని పదార్థాలను కూడా అందించనుంది.
అమరావతిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి మంగళవారం సీఐడీ అధికారులు వెళ్లారు. టీడీపీ జనరల్ సెక్రటరీ పేరిట సీఐడీ నోటీసులను కూడా జారీ చేసింది.
RK Roja : ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా మంగళవారం మాచర్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె... చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం, సైతాన్ చంద్రబాబు అని రోజా ఆరోపించారు. టీడీపీ, జనసేన పార్టీలకు దమ్ముంటే ఇంటింటికీ వెళ్లి ఏం చేశారో చెప్పగలవా? అని ప్రశ్నించారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వార్తలో ఉంటారు. ఈసారి డ్యాన్స్ చేసి వార్తల్లోకి వచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంలోకి టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేరగా.. వెల్ కం చెప్పి స్టెప్పులు వేశారు.