BPT: అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు నమోదు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఓటరు నమోదు అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (KORGRP R&R యూనిట్, ఒంగోలు) విజయ జ్యోతి కుమారి అధ్యక్షత వహించారు. సమావేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ ప్రక్రియపై వివరించారు.