VSP: కేజీహెచ్ లోని రాజేంద్రప్రసాద్ వార్డులో జగదీష్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఈ నెల 1న మృతిచెందారు. దీంతో ఆవేదన చెందిన అతని బంధువులు ఆసుపత్రిలో ఫర్నిచర్ను ధ్వంసం చేసి విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్పై దాడికి పాల్పడ్డారు. దీనిపై ఆర్ఎంవో ఆర్వీఎస్ కుమార్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ పూడి వరప్రసాద్ సంఘటనపై పరిశీలన చేసి పలువురిపై కేసు నమోదు చేశారు.