• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు ఆలూరులో మెగా జాబ్ మేళా

KRNL: ఆలూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 20న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి టీడీపీ ఆలూరు ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. SSC నుంచి PG వరకు అర్హత కలిగిన 18–35 ఏళ్ల యువత పాల్గొనవచ్చుని ఇన్ ఛార్జ్ తెలిపారు.

February 20, 2026 / 08:18 AM IST

గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

CTR: మురకంబట్టు సమీపంలోని మైనారిటీ గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 5, 6, 7, 8వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నజీర్బాను నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు https://apcfss.in వెబ్‌సైట్ ద్వారా మార్చి 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 08:18 AM IST

యాగంటి ఉమామహేశ్వర స్వామికి విశేష పూజలు

NDL: బనగానపల్లె మండల పరిధిలో శైవ పుణ్యక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో పాల్గొనమాసం శుక్రవారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. ఆలయ ఈవో పాండురంగారెడ్డి వేద పండితులు ఆధ్వర్యంలో స్వామికి రుద్రాభిషేకం కుంకుమార్చన ప్రత్యేక పుష్పాలంకరణలో అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. అలాగే నందవరం చౌడేశ్వరి మాతకు విశేష పూజలు చేశారు.

February 20, 2026 / 08:12 AM IST

నేడు దివ్యాంగులకు అండగా స్వాభిమాన్ వేదిక

SKLM: దివ్యాంగుల సంక్షేమం, వారి సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి నెల మూడవ శుక్రవారం నిర్వహించే ‘స్వాభిమాన్’ వేదికను శుక్రవారం నిర్వహించనున్నట్లు దివ్యాంగ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొడ్డేపల్లి శైలజ తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.

February 20, 2026 / 08:12 AM IST

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: పెదగంట్యాడ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధి గాంధీనగర్, వినాయకనగర్ ఫీడర్ల నిర్వ హణ పనుల కారణంగా ఇవాళ పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని జోన్-2 ఈఈ బీకే నాయుడు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చిననడుపూరు, సీతానగరం, అయ్యప్ప టెంపుల్ రోడ్డులో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 20, 2026 / 08:10 AM IST

ఘనంగా మదనాపురం జాతర మహోత్సవాలు

VZM: గంట్యాడ మండలం మదనాపురం గ్రామంలో రెండు రోజులపాటు జరిగిన శ్రీ బాల సాదు సన్యాసమ్మ తీర్థ మహోత్సవాలు గురువారం రాత్రితో ముగిశాయి. తీర్థ మహోత్సవంలో భాగంగా గురువారం గుర్రపు పందాలు ఎడ్ల పందాలు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ పోటీలను తిలకించారు.

February 20, 2026 / 08:09 AM IST

నేడు టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్

SKLM: ఆమదాలవలస పట్టణంలో గల స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రవికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమదాలవలస టీడీపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ప్రజలు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేయవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 20, 2026 / 08:08 AM IST

ఉద్యోగాల భర్తీకి కర్నూలు కలెక్టర్ నిర్ణయం

KRNL: ఆదోని వన్ స్టాప్ సెంటర్‌లో 13 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఇవాళ వెల్లడించారు. అభ్యర్థుల వయస్సు 18-39 ఏళ్ల మధ్య ఉండాలని, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 24లోపు కలెక్టరేట్లోని ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

February 20, 2026 / 08:04 AM IST

ఈనెల 23న కావలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

NLR: ఈనెల 23న మధ్యాహ్నం 2 గంటలకు కావలి ట్రంక్ రోడ్డులోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి కళ్యాణ మండపంలో వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

February 20, 2026 / 08:03 AM IST

నేడు మిర్చి యార్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

GNTR: గుంటూరు మిర్చి యార్డ్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరగనుంది. నూతన ఛైర్మన్‌గా కుర్రా అప్పారావు, వైస్ ఛైర్మన్‌ బిట్రగుంట మల్లిక, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుజ్జనగుండ్ల చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జరిగే కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ ఏర్పాట్లను పెదకూరపాడు MLA భాష్యం ప్రవీణ్ గురువారం పర్యవేక్షించారు.

February 20, 2026 / 08:02 AM IST

ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ

కృష్ణా: ఈనెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో పాల్గొనే విద్యార్థులకు మొవ్వ క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాల్ టికెట్లను నిన్న పంపిణీ చేశారు. కళాశాల ఇంఛార్జ్ సుధాకర్ మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్ కోర్సుకు చెందిన 98 మంది, వృత్తి విద్య కోర్సుకు చెందిన 60 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.

February 20, 2026 / 08:01 AM IST

రేపు మండల సర్వసభ్య సమావేశం

KRNL: దేవనకొండ మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో రేపు ఉదయం 11 గంటలకు ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ జ్యోతి ఇవాళ తెలిపారు. అన్నిశాఖల అధికారులు ప్రగతి నివేదికలతో రావాలని సూచించారు. అలాగే.. సమావేశానికి ప్రజాప్రతి నిధులు హాజరు కావాలని కోరారు.

February 20, 2026 / 08:00 AM IST

నేడు పెదవేగిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

ELR: పెదవేగి మండలంలోని కూచింపూడి విద్యుత్ ఉపకేంద్రం RDSS పథకం లైన్లు మెరుగుదల పనుల దృష్ట్యా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ అంబేద్కర్ గురువారం తెలిపారు. YSR  బొమ్మ రోడ్డు, శూద్ర వారి మెట్టా, నాలుగు పంచాయతీ బోర్లు తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

February 20, 2026 / 08:00 AM IST

అగ్ని ప్రమాదంలో కాఫీ, మిరియాల తోటలు దగ్ధం

ASR: జీ.మాడుగుల మండలం గన్నేరుపుట్టులో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో 4 కుటుంబాలకు చెందిన కాఫీ, మిరియాల తోటలు దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పాంగి సీతన్న, చిన్నమ్మి, భీమన్న, మఠం రాంబాబు అనే రైతులకు చెందిన సుమారు 4 ఎకరాల్లో ఉన్న కాఫీ, మిరియాల తోటల్లో మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

February 20, 2026 / 08:00 AM IST

నేడు, రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: ఉండ్రాజవరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్ర, శనివారాల్లో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల నిమిత్తం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏపీ ఈపీడీసీఎల్ నిడదవోలు ఎస్ఈ ఎన్. నారాయణ అప్పారావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వేలివెన్ను, కాల్దరిలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి అధికారులకు సహకరించాలన్నారు.

February 20, 2026 / 07:54 AM IST