ప్రకాశం: గిద్దలూరు మండలం నరవ గ్రామ సమీపంలోని నీటి కుంటలో పడి ఓ గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.