ప్రకాశం: పొన్నలూరు మండలం మాలపాడులో మార్కెట్ కమిటీ యార్డ్ వారి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. బుధవారం డాక్టర్ శివరామకృష్ణ పశువులకు గాలికుంట వ్యాధులు రాకుండా టీకాలు వేశారు. పశువులకు సీజనల్ వ్యాధులు సోకకుండా గ్రామస్తులకు జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ కర్నా తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.