కోనసీమ: ప్రముఖ సినీ నటి, మాజీమంత్రి ఆర్కే రోజా బుధవారం ఉదయం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.