KRNL: తల్లికి, సొంత చెల్లికి న్యాయం చేయలేని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఇవాళ కర్నూలులో మాట్లాడుతూ.. కుటుంబ వ్యవహారాల్లోనే న్యాయం చేయలేని నాయకుడు ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తాడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.